
84 మందితో సిడబ్ల్యుసి పునర్వ్యవస్థీకరణ
ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో :కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సిడబ్ల్యుసి)ని 84 మందితో పునర్వ్యవస్థీకరించారు. ఈ మేరకు ఆదివారం కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జునఖర్గే ప్రకటించారు. కాంగ్రెస్ పార్టీలో నిర్ణయాలు తీసుకునే అత్యున్నత స్థాయి వ్యవస్థ అయిన సిడబ్ల్యుసి సభ్యుడిగా ఆంధ్రప్రదేశ్ నుంచి రఘువీరారెడ్డి నియమితులయ్యారు. తెలుగు రాష్ట్రాల నుంచి సిడబ్ల్యుసి శాశ్వత ఆహ్వానితులుగా టి.సుబ్బిరామిరెడ్డి, కె.రాజు, దామోదర రాజనర్సింహకు అవకాశం లభించింది. ప్రత్యేక ఆహ్వానితులుగా పల్లం రాజు, వంశీచంద్రెడ్డి నియమితులయ్యారు.