
ప్రజాశక్తి -అమరావతి బ్యూరో :తిరుమల తిరుపతి దేవస్థానం (టిటిడి) ఛైర్మన్గా తిరుపతి వైసిపి ఎమ్మెల్యే భూమన కరుణాకర్రెడ్డి రెండో సారి బాధ్యతలు చేపట్టనున్నారు. ప్రస్తుతం టిటిడి ఛైర్మన్గా వ్యవహరిస్తున్న వైవి సుబ్బారెడ్డి పదవీకాలం ఈ నెల 8తో ముగియనుండటంతో ఆయన స్థానంలో భూమనను నియమించారు. ఈ మేరకు భూమన పేరును ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి ఖరారు చేశారు. గతంలో 2006ా08 వరకు టిటిడి ఛైర్మన్గా భూమన పనిచేశారు. 2012, 2019లో తిరుపతి నుంచి వైసిపి ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2023 జులై నుంచి సభా హక్కుల కమిటీ ఛైర్మన్గానూ ఉంటున్నారు. భూమన స్వస్థలం వైఎస్ఆర్ కడప జిల్లా నందలూరు మండలం, ఈదరపల్లి. శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయంలో మాస్టర్ డిగ్రీ చేశారు. వైవి సుబ్బారెడ్డి లేదా ఆయన కుమారుడు ఒంగోలు ఎంపి అభ్యర్థిగా పోటీ చేసేందుకు ఆసక్తి చూపుతున్నారని, ఆయన స్థానంలో ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తికి టిటిడి ఛైర్మన్ పదవి ఇవ్వనున్నట్లు ఇప్పటివరకు ప్రచారం జరిగిన సంగతి తెలిసిందే.