ప్రజాశక్తి-తిరుమల : తిరుమల శ్రీవారిని ఆదివారం ఏపీ రాష్ట్ర గవర్నర్ ఎస్.అబ్దుల్ నజీర్ కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకున్నారు. ఆలయం వద్దకు చేరుకున్న గవర్నర్కు టీటీడీ ఈవో ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి, ఎవి. ధర్మారెడ్డి, జేఈవో వీరబ్రహ్మం, సివిఎస్వో నరసింహ కిషోర్ సాదరంగా అహ్వానించగా, అర్చక బృందం ''ఇస్తికఫాల్'' ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో ఎస్.అబ్దుల్ నజీర్ వేదపండితులు వేదాశీర్వచనం చేశారు. ఈ సందర్భంగా ఛైర్మన్, ఈవో తీర్థప్రసాదాలు, శ్రీవారి చిత్రపటాన్ని, 2024 టీటీడీ క్యాలెండర్లు డైరీలు అందించారు. ఈ కార్యక్రమంలో డెప్యూటీ ఈవోలు లోకనాథం. విజివో బాలిరెడ్డి, ఇతర అధికారులు పాల్గొన్నారు.










