
ప్రజాశక్తి-దర్శి: గత 28 రోజులుగా పాలస్తీనాపై ఇజ్రాయిల్ చేస్తున్న యుద్ధం అమానుషంగా సాగుతోందని, యుద్ధాన్ని ఆపాలని, శాంతిని నెలకొల్పాలని సీపీఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు కంకణాల ఆంజనేయులు అన్నారు. స్థానిక గడియార స్తంభం సెంటర్లో సీపీఎం నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఆంజనేయులు మాట్లాడుతూ అమెరికా అండతో పాలస్తీనాపై ఇజ్రాయిల్ అమానుష కాండను సాగిస్తుందని అన్నారు. యుద్ధ నివారణపై తీసుకోవాల్సిన చర్యలపై భద్రతా మండలిలో జరిగిన సమావేశానికి మోదీ హాజరు కాకపోవడం విచారకరమన్నారు. అమెరికాకు మడగులొత్తుతూ ఇజ్రాయిల్కు మద్దతు ఇవ్వడం సిగ్గుచేటన్నారు. ఇప్పటికే ఈ యుద్ధంలో 9వేల మంది మరణించారని, వారిలో 3,600 మంది చిన్నారులు ఉన్నారని అన్నారు. ఇప్పటికైనా ఐక్యరాజ్యసమితి చెప్పిన విధంగా యుద్ధం ఆపాలని, శాంతిని నెలకొల్పాలని కోరారు. ఈ కార్యక్రమంలో సీపీఎం నియోజకవర్గ కార్యదర్శి తాండవ రంగారావు, సీఐటీయు, డీవైఎఫ్ఐ రైతు సంఘ నాయకులు గోను వెంకయ్య, కేవీ పిచ్చయ్య, ఎస్ వెంకటేశ్వరరావు, టి రంగనాయకులు, ఉప్పు నారాయణ, షేక్ కాలేబాషా, నాగరాజు, ఆదినారాయణ, పుల్లయ్య, లక్ష్మీ, పద్మ, రంగమ్మ, కోటేశ్వరావు, వెంకటస్వామి, కొండయ్య పాల్గొన్నారు.