Oct 27,2023 22:56

ప్రజాశక్తి-అమలాపురం
అమలాపురం రెవెన్యూ డివిజనల్‌ అధికారిగా పనిచేసి బదిలీపై గుంటూరు జిల్లా పరిషత్‌ సిఇఒగా నియమితులైన ఎన్‌ఎస్‌విబి.వసంతరాయుడు సేవలు ప్రశంసనీయమని జిల్లా కలెక్టర్‌ హిమాన్షు శుక్లా పేర్కొన్నారు. బదిలీపై వెళుతున్న ఆర్‌డిఒ వసంతరాయుడుకు ఘనంగా వీడ్కోలు పలికారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్‌ మాట్లాడుతూ నూతనంగా ఏర్పడిన డాక్టర్‌ బిఆర్‌.అంబేద్కర్‌ కోనసీమ జిల్లా కార్యాలయ ఏర్పాటుకు భవనాలు సేకరణ జిల్లాలో వరద పరిస్థితులను అధిగమించడంలో వసంతరాయుడు చాకచక్యం గా వ్యవహరించి, ఆ సమస్యల ను అధిగమించే వారిని తెలిపారు. గుంటూరు జిల్లా పరిషత్‌ సిఇఒగా మరింత మంది ప్రశంసలు అందుకోవాలని ఆకాంక్షించారు. గోదావరి వరదలు, జిల్లాకు పేరు మార్పు సందర్భంలోనూ శాంతిభ ద్రతల పరిరక్షణలోనూ ఆర్‌డిఒ, డిఎస్‌పి అన్ని శాఖల సమన్వయంతో సమర్థవంతంగా పనిచేశారన్నారు. ఆర్‌డిఒ సమన్వయంతో తాను పలు సమస్యలను అధిగమించడం జరిగిందన్నారు. జెసి ఎస్‌.నుపూర్‌ అజరు, డిఆర్‌ఒ సిహెచ్‌.సత్తిబాబు, వికాస జిల్లా మేనేజర్‌ గోళ్ల రమేష్‌ ప్రసంగించారు. సన్మాన గ్రహీత బదిలీపై వెళుతున్న వసంతరాయుడు మాట్లాడుతూ అన్ని శాఖల సిబ్బందిని సమన్వయ పరుస్తూ తారతమ్యాలకు తావు లేకుండా వ్యవహరించడం వల్లే అందరి ఆదరాభిమానాలను పొందగ లిగానన్నారు. జిల్లా కలెక్టర్‌, రెవెన్యూ సిబ్బంది బదిలీపై వెళ్తున్న ఆర్‌డిఒను ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో నూతనంగా పదవి బాధ్యతలు చేపట్టిన ఆర్‌డిఒ జి. కేశవర్ధన్‌ రెడ్డి, డివిజన్‌ పరిధిలోని తహశీల్దార్లు, జిల్లా అధికారులు తదితరులు పాల్గొ న్నారు.