Nov 16,2023 16:40

ప్రజాశక్తి - చింతలపూడి
   జగనన్న గోరుముద్దలో భాగంగా విద్యార్థులకు మంచి పౌష్టికాహారం ఇవ్వడమే కాకుండా వంటలు చేసే పాత్రలు కూడా నాణ్యమైన ఎస్‌ఎస్‌ మెటీరియల్‌తో తయారుచేసినవి సిఎం జగన్మోహన్‌రెడ్డి అన్ని పాఠశాలలకు అందిస్తున్నారని చింతలపూడి ఎంపిపి రాంబాబు తెలిపారు. జగనన్న గోరుముద్ద కార్యక్రమంలో భాగంగా రేచర్ల గ్రామంలో ప్రభుత్వం వారిచే పంపిణీ చేయబడిన వంట పాత్రలను ఎంపియుపి పాఠశాలలో సర్పంచి కె.శివ రామకృష్ణ చేతుల మీదుగా అందజేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు నరుకుళ్ల సుబ్బారావు, డా.వెంకటప్పయ్య, విద్యా కమిటీ ఛైర్మన్‌ నరుకుళ్ల పార్వతి, హెచ్‌ఎం ఎన్‌ఎస్‌.రాజేంద్రకుమార్‌, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.