Oct 28,2023 11:39

ప్రజాశక్తి-రామచంద్రపురం : వాల్మీకి జయంతిని రాష్ట్ర పండుగగా నిర్వహించాలని ముఖ్యమంత్రి జగన్ ఆదేశించారని రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి వేణుగోపాలకృష్ణ తెలియ చేశారు. ఆయన క్యాంపు కార్యాలయంలో శనివారం వాల్మీకి మహర్షి జయంతి ఉత్సవo నిర్వహించారు. కార్యక్రమంలో మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాల కృష్ణ . వాల్మీకి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ధర్మాన్ని ఎలా రక్షించాలో వాల్మీకి మహర్షి తన రామాయణం ద్వారా ప్రజలకు అందించారని మనిషి సన్మార్గంలో నడిచేందుకు ఆయన చేసిన కృషిని మంత్రి అభినందించారు. ఈ కార్యక్రమంలో పలువురు వైసిపి నాయకులు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.