
నేటి నుంచి ఇంటింటా ప్రచారం : ఎమ్మెల్యే
విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న ఎమ్మెల్యే ఆరణి
ప్రజాశక్తి- చిత్తూరు అర్బన్: రాష్ట్రానికి జగనే ఎందుకు ముఖ్యమంత్రి కావాలి అంటూ రాష్ట్ర ప్రభుత్వం చేసిన సంక్షేమ పథకాలను ఇంటింటా ప్రచారం కార్యక్రమం గురువారం నుంచి నిర్వహిస్తున్నట్లు చిత్తూరు ఎమ్మెల్యే ఆరని శ్రీనివాసులు తెలిపారు. బుధవారం స్థానిక వైసిపి కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా మరోమారు జగన్మోహన్ రెడ్డిని ఎన్నుకోవాలని కోరుతూ ఐదేళ్లపాటు రాష్ట్ర ప్రభుత్వం చేసిన సంక్షేమ కార్యక్రమాలను చిత్తూరు నియోజకవర్గంలోని ప్రతి ఇంటికి వైసిపి నాయకులు, కార్యకర్తలు వెళ్లి ప్రచారం చేయనున్నట్లు తెలిపారు. నగర మేయర్ అముద, నాయకులు జ్ఞాన జగదీష్, టౌన్ బ్యాంక్ చైర్మన్ రామ్ గణేష్, కోలాకిరణ్ పాల్గొన్నారు.