Nov 09,2023 21:18

ప్రజాశక్తి - పోలవరం
         మండలంలోని కొత్త పట్టిసీమ గ్రామానికి చెందిన వికలాంగుడు మండెల్లి బుల్లి వెంకట్రాజుకు దేవోక్తి చిడిపి సోషల్‌ సర్వీస్‌ వారి ఆధ్వర్యంలో ఎఎస్‌ఒ జోడాల వెంకట్‌ చేతులమీదుగా గురువారం క్రచ్చర్స్‌ అందించారు. ఈ సందర్భంగా వెంకట్‌ మాట్లాడుతూ దేవోక్తి చిడిపి సోషల్‌ సర్వీస్‌ ద్వారా ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నామని తెలిపారు. గురువారం పలు గ్రామాల్లో రూ.పది వేల విలువైన మూడు జతల క్రచ్చర్స్‌, ఐదు వాకర్లు వికలాంగులకు వారి ఇంటి వద్దకు వెళ్లి ఇచ్చామని తెలిపారు. కృత్రిమ అవయవాలు, వాకర్లు, క్రచ్చర్స్‌ కావాల్సినవారు 9391089381 నెంబర్‌ని సంప్రదించాలని చెప్పారు. ఎఎస్‌ఒ జోడాల వెంకట్‌, టీచర్‌ సునీత, దాస్‌ కల్యాణి, పద్మ, శాంతి, సుభాషిని ఆర్థిక సాయం చేశారు. ఈ కార్యక్రమంలో అబెడ్నేగో, తొర్లపాటి రాజీవ్‌, కిషోర్‌ పాల్గొన్నారు.