Nov 14,2023 21:26

   జంగారెడ్డిగూడెం : స్థానిక రోమన్‌ క్యాథలిక్‌ మిషన్‌ సోషల్‌ సర్వీస్‌ సెంటర్‌ ఆధ్వర్యంలో ఆర్‌సిఎం చర్చి ఆవరణలో విభిన్న ప్రతిభావంతులకు మంగళవారం ఉచితంగా బస్సుపాస్‌లు అందజేశారు. ఏలూరు మేత్రాసనం సోషల్‌ సర్వీస్‌ సెంటర్‌ డైరెక్టర్‌ ఫాదర్‌ ఇమ్మానియేల్‌ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా ఫాదర్‌ ఇమ్మానుయేలు మాట్లాడుతూ నాలుగు జిల్లాల పరిధిలో సోషల్‌ సర్వీస్‌ సెంటర్‌ ద్వారా పలు సేవా కార్యక్రమాలు చేపడుతున్నట్టు తెలిపారు. మంగళవారం నిర్వహించిన ఈ ప్రత్యేక శిబిరంలో 250 మంది విభిన్న ప్రతిభావంతులకు బస్సు పాసులను అందజేశామన్నారు. ఈ కార్యక్రమంలో జంగారెడ్డిగూడెం ఆర్‌టిసి డిపో మేనేజర్‌ గంగాధర్‌ రావు, స్థానిక ఆర్‌సియం చర్చి విచారణ గురువులు ఫాదర్‌ కె.కళ్యాణ్‌ కుమార్‌ పాల్గొన్నారు.