
వెయ్యి సెల్ఫోన్లు రికవరీ
ప్రజాశక్తి- చిత్తూరుఅర్బన్: వివిధ కారణాలతో పొగొట్టుకున్న సెల్ఫోన్లును చాట్బాట్ పోలీస్ యాప్ ద్వారా యజమానులకు అందజేసింది. దాదాపు రెండు కోట్లకు పైగా విలువ చేసే వెయ్యి సెల్ఫోన్లను పోలీస్శాఖ రికవరీ చేసిన్నట్లు అడిషనల్ ఎస్పీ అడ్మిన్ సుధాకర్ తెలిపారు. ఈ సందర్భంగా అడిషనల్ ఎస్పీ అడ్మిన్ మీడియాతో మాట్లాడుతూ మారుతున్న జీవనశైలిలో మొబైల్ వినియోగం ఎక్కువైందని, మొబైల్ ఫోన్ చోరీకి గురైతే ఎటువంటి కంప్లయింట్ లేకుండా పోలీస్స్టేషన్కు వెళ్ళకుండా ఎఫ్ఐఆర్ నమోదు చేయకుండా ఇంట్లో కూర్చొని చిత్తూరు పోలీసు వారి చాట్ బాట్ సేవల ద్వారా పోగొట్టుకున్న మొబైల్ ఫోన్ను మరల పొందవచ్చునని తెలిపారు. చిత్తూరు జిల్లా వ్యాప్తంగా రెండు నెలల వ్యవధిలో మూడవసారి 300 మొబైల్ ఫోన్లను రికవరీ చేసి బాధితులకు అందజేయడం సంతోషంగా ఉందన్నారు. ప్రజలకు మంచి సేవలందించేందుకు చాట్ బాట్ బందం మొబైల్ ట్రాకింగ్ పై బాగా పని చేస్తున్నారన్నారు. పోయిన మొబైల్ ఫోన్లు మన రాష్ట్రం లోనే కాకుండా ఇతర రాష్ట్రాలు అయిన జమ్మూ అండ్ కాశ్మీర్, రాజాస్థాన్, ఢిల్లీ, కేరళ, బీహార్, పంజాబ్, మన జిల్లా సరిహద్దు రాష్ట్రాలైన తెలంగాణ, తమిళనాడు, కర్నాటక వంటి రాష్ట్రాల వాని మొబైల్ ఫోన్ల రికవరీ చేసి భాదితులకు అందజేసిన పోలీస్ సిబ్బంది పనితీరు హర్షనీయమని తెలిపారు. ఇంకా పెండింగ్ రికవరీలు ఉన్నాయని వాటిని కూడా అతిత్వరలో రికవరీ చేసి భాదితులకు అందచేస్తామని తెలియజేసారు. మొబైల్ వివరాలను తెలియజేస్తే బాధితులకు త్వరితగతిన అందజేసేందుకు కషి చేస్తామని అడిషనల్ ఎస్పీ తెలిపారు.