
ఓటరు నమోదు కేంద్రాన్ని తనిఖీ చేస్తున్న ఆర్డీవో
ప్రజాశక్తి-పీసీపల్లి: పిసిపల్లి ఓటరు నమోదు కేంద్రాలను కనిగిరి ఆర్డీవో పాలపర్తి జాన్ ఇర్విన్ ఆదివారం తనిఖీ చేశారు. మండలం లోని పెద అలవలపాడు, మారెళ్ల, పిసిపల్లి, పెదవరి మడుగు, పెద ఇర్లపాడు, గుంటుపల్లి కేంద్రాలను ఆయన తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఓటర్ల నమోదులో ఎలాంటి అవకతవకలకు పాల్పడవద్దని బిఎల్ఓలను హెచ్చరించారు. అక్రమాలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. డిసెంబర్ 9వ తేదీ లోపు అర్హులైన వారు ఓటుకు దరఖాస్తు చేసుకోవచ్చని ఆయన తెలిపారు. వీరి వెంట పీసీపల్లి తహశీల్దారు కే ప్రవీణ్ కుమార్, ఎన్నికల డిప్యూటీ తహశీల్దారు రమేష్, బూత్ లెవెల్ ఆఫీసర్లు, వీఆర్వోలు ఉన్నారు.