Nov 05,2023 22:29


ప్రజాశక్తి-చిత్తూరుఅర్బన్‌: జీజేఎం ట్రస్ట్‌ ఆధ్వర్యంలో శ్రీరంగంపల్లెలో వాలీబాల్‌ పోటీలు గురజాల జగన్‌మోహన్‌ యువసేన జిల్లాస్థాయి వాలీబాల్‌ పోటీలు నిర్వహించారు. ఆదివారం విజేతలకు బహుమతుల ప్రధాన కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య అతిధులుగా పాల్గొన్న జిజేఎం ట్రస్ట్‌ చైర్మెన్‌ జగన్‌మోహన్‌నాయుడు, పూతలపట్టు టిడిపి నియోజవర్గ ఇన్‌చార్జి మురళి, గుడిపాల టిడిపి ఇన్‌చార్జి సుబ్బానాయుడు, నాయకులు అనిల్‌, మేమాద్రినాయుడులతో పాటు స్థానిక నాయకుల సమక్షంలో విజేతలకు బహుమతులు, జ్ఞాపికలను ప్రధానం చేశారు. ప్రధమ బహుమతి వేలూరు అవెంజర్స్‌ రూ. 15,000 ద్వితీయ బహుమతి బంగారుపాళ్యం టీం గెలుపొందగా మొత్తం 8 టీంలకు బహుమతులు ప్రధానం చేశారు. మొత్తం రూ. 50 వేల రూపాయలతో వాలీబాల్‌ పోటీల్లో పాల్గొన్న క్రీడాకారులు బహుతులు, జ్ఞాపికలను అందజేశారు.