Nov 08,2023 23:06

ఉత్సాహంగా 'నీటి దీపావళి' నీటి దీపావళి కార్యక్రమంలో మున్సిపల్‌ సిబ్బంది, డ్వాక్రా మహిళలు

ఉత్సాహంగా 'నీటి దీపావళి'
నీటి దీపావళి కార్యక్రమంలో మున్సిపల్‌ సిబ్బంది, డ్వాక్రా మహిళలు

ప్రజాశక్తి- చిత్తూరు అర్బన్‌: అమృత్‌ 2.0పథకంలో భాగంగా చిత్తూరు నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో బుధవారం నీటి దీపావళి కార్యక్రమాన్ని నిర్వహించారు. మహిళలకు మంచినీటి ఆవశ్యకత, నీటిశుద్ధి, సరఫరా అంశాలపై అవగాహన కల్పించడం కోసం కేంద్ర ప్రభుత్వం, అమృత్‌ 2.0 మార్గదర్శకాల మేరకు కలవకుంట నగరపాలక నీటి శుద్ధి కేంద్రంలో నిర్వహించిన 'నీటి దీపావళి' కార్యక్రమంలో నగర పరిధిలోని స్వయం సహాయక సంఘాల మహిళలు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మహిళలకు వాటర్‌ ట్రీట్మెంట్‌ ప్లాంట్లో నీటిశుద్ధి విధానంపై అవగాహన కల్పించారు. నీరు ఏఏ దశల్లో శుద్ధి చేయబడుతుంది, యంత్రాల వినియోగం తదితర అంశాలపై ప్రత్యక్ష అవగాహన కల్పించారు. నీటిని వధా చేయరాదని, భావితరాలకు అందించేలా వనరులను పొదుపుగా వినియోగించాలని, ఇదే అంశాన్ని ప్రజలకు తెలియ చెప్పాలన్నారు. ఈసందర్భంగా మహిళలు పూజలు నిర్వహించారు. నీటి నాణ్యతను ఎలా పరీక్షిస్తారో చేసి చూపించారు. ఈ సందర్భంగా మహిళలకు నీటి సీసాలను పంపిణీ చేశారు. కార్యక్రమంలో డీఈఈ రమణ, సీఎంఎం గోపి, అమత్‌ 2.0 సిబ్బంది , డ్వాక్రా మహిళలు పాల్గొన్నారు.