Nov 03,2023 23:26

ప్రజాశక్తి -యదమరి
యాదమరి ఉన్నత పాఠశాలను చిత్తూరు జిల్లా విద్యాశాఖ అధికారి విజయేంద్ర రావు శుక్రవారం మండల కేంద్రంలోని జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలను సందర్శించారు. పాఠశాలలో నిర్వహిస్తున్న రాష్ట్రస్థాయి అచీవ్మెంట్‌ సర్వే 2023-24 పరీక్షలను పరిశీలించారు. అదేవిధంగా పాఠశాలలో చదువుతున్న విద్యార్థుల యొక్క విద్యాస్థాయిని పరీక్షించారు. విద్యార్థులను వివిధ ప్రశ్నలు అడిగి వారు చెప్పిన సమాధానాలు పట్ల సంతప్తిని వ్యక్తం చేశారు. విద్యార్థులు అందరూ పాఠ్యాంశాలను శ్రద్ధగా విని నోట్స్‌ లు రాసి నేర్చుకోవాలని తెలియజేశారు. పాఠశాలలో ఉపయోగిస్తున్న స్మార్ట్‌ టీవీలను పరిశీలించారు. వాటిని ఉపయోగిస్తున్న తీరును పరిశీలించి సంతప్తి వ్యక్తం చేశారు. అలాగే పాఠశాలలోని మరుగుదొడ్లను పరిశీలించి శుభ్రంగా ఉండడాన్ని గమనించారు. పాఠశాల స్కావెంజర్స్‌ తో మాట్లాడి వారికి కొన్ని సూచనలు తెలియజేశారు. పాఠశాలలో అమలవుతున్న మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించి సంతప్తిని వ్యక్తం చేశారు. పాఠశాల ప్రధానోపాధ్యాయులు గిరి రాజా, మండల విద్యాశాఖ అధికారులు రుక్మిణి, ప్రసాద్‌ పాల్గొన్నారు.