Nov 08,2023 22:10

ప్రజాశక్తి - యంత్రాంగం
          విశాఖ ఉక్కు ప్రయివేటీకరణను వ్యతిరేకిస్తూ ఫ్యాక్టరీ వద్ద ఉద్యోగులు, ప్రజలు, నేతలు చేపట్టిన నిరసన దీక్షలు వెయ్యి రోజులు పూర్తయిన సందర్భంగా విద్యార్థి, యువజన సంఘాలు బుధవారం రాష్ట్రవ్యాప్తంగా చేపట్టిన విద్యా సంస్థల బంద్‌ జిల్లాలో విజయవంతమైంది. ఈ సందర్భంగా స్కూళ్లు, కాలేజీలు మూతపడ్డాయి. ఉక్కు ప్రయివేటీకరణను కేంద్ర ప్రభుత్వం తక్షణం విరమించుకోవాలని, కడపలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు వేగవంతం చేయాలని ఆందోళనకారులు డిమాండ్‌ చేశారు.
ఏలూరు అర్బన్‌ : జిల్లా కేంద్రం ఏలూరులో పిడిఎస్‌యు, ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో ఏలూరులో పలు ప్రభుత్వ, ప్రయివేటు పాఠశాలలు, కళాశాలలను మూయించారు. అనంతరం నగరమంతా బైక్‌ ర్యాలీ నిర్వహించి కస్తూరిబా స్కూల్‌ ముందు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా పిడిఎస్‌యు జిల్లా అధ్యక్షులు కాకినాని, ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు దినేష్‌ మాట్లాడుతూ బిజెపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రభుత్వరంగ సంస్థలను కూడా ప్రయివేటు పరం చేస్తున్నారన్నారు. విద్యార్థుల బలిదానాల సాక్షిగా ఏర్పడిన విశాఖ ఉక్కును నేడు కేంద్ర ప్రభుత్వం అమ్మేస్తానని బాహాటంగా ప్రకటిస్తున్నా రాష్ట్ర ప్రభుత్వం స్పందించకపోవడం దురదృష్టకరమన్నారు. విభజన హామీల్లో భాగంగా కడపలో స్టీల్‌ ప్లాంట్‌ ఏర్పాటు చేస్తామని చెప్పారని, ఇప్పటికి రెండుసార్లు శంకుస్థాపన చేసినప్పటికీ పనులు మొదలు పెట్టకపోవడం వల్ల రాయలసీమలో ఉన్న విద్యార్థులు, నిరుద్యోగులు ఆందోళనకు గురవుతున్నారని, దాని ఫలితంగా ఇతరరాష్ట్రాలకు విద్యార్థులు, నిరుద్యోగులు వలసపోతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో పిడిఎస్‌యు నగర అధ్యక్షులు ఎం.క్రాంతి, పిడిఎస్‌యు నాయకులు కె.సునీల్‌, ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు వంశీ, విద్యార్థులు పాల్గొన్నారు.
జంగారెడ్డిగూడెం:విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రయివేటీకరణ నిర్ణయాన్ని కేంద్ర ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని పిడిఎస్‌ఒ జిల్లా కార్యదర్శి ఎస్‌.మోహన్‌ డిమాండ్‌ చేశారు. బుధవారం విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ పరిరక్షణ, కడపలో ఉక్కు ఫ్యాక్టరీ నిర్మాణం కోరుతూ రాష్ట్రవ్యాప్తంగా విద్యార్థి, యువజన సంఘాల పిలుపులో భాగంగా కెజి టు పీజీ విద్యాసంస్థల బంద్‌ పట్టణంలోలో విజయవంతంగా సాగింది. స్థానిక ప్రభుత్వ జూనియర్‌ కళాశాల వద్ద పిడిఎస్‌ఒ ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఎస్‌.మోహన్‌ మాట్లాడుతూ స్టీల్‌ ప్లాంట్‌ ప్రయివేటీకరణ నిర్ణయాన్ని కేంద్రం తక్షణమే వెనక్కి తీసుకోవాలని, స్టీల్‌ ప్లాంట్‌కి సొంతగనులను కేటాయించాలని, స్టీల్‌ ప్లాంట్‌లో ఖాళీ పోస్టులను భర్తీ చేయాలనీ డిమాండ్‌ చేశారు. ప్రభుత్వ రంగ సంస్థల అమ్మకాన్ని ఆపాలని, యువతకు భద్రతతో ఉపాధి అవకాశాలు కల్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో పిడిఎస్‌ఒ రాష్ట్ర కోశాధికారి ఎల్‌.భాను, జిల్లా నాయకులు ఎం.రాజా పాల్గొన్నారు.
చింతలపూడి:విశాఖ ఉక్కు ప్రయివేటీకరణను వ్యతిరేకిస్తూ విశాఖ ఉక్కు పోరాట కమిటీ చేస్తున్న పోరాటం వెయ్యి రోజులు కావస్తున్న సందర్భంగా అన్ని విద్యార్థి, యువజన సంఘాల ఆధ్వర్యంలో చేపట్టిన విద్యాసంస్థల బందు మండలంలో విజయవంతమైంది. చింతలపూడి పట్టణంలో ప్రయివేటు విద్యాసంస్థలు మూతపడ్డాయి. ఈ సందర్భంగా ఎఐఐవైఎఫ్‌ జిల్లా కో కన్వీనర్‌ తొర్లపాటి రాజు, ఎఐఎస్‌ఎఫ్‌ నాయకులు కంభం ప్రసన్నకుమార్‌, ఎఐఎస్‌ఎ జిల్లా అధ్యక్షులు పింగుల ప్రసన్న మాట్లాడారు. ఈ బందులో నాయకులు బొల్లవరపు విజరు, శేఖర్‌, సాలి అవినాష్‌, కంభం శ్రీను, కొండ బాబి పాల్గొన్నారు.
బుట్టాయగూడెం : మండలంలో బంద్‌ ప్రశాంతంగా ముగి సింది. ఈ సందర్భంగా పిడిఎస్‌యు నాయకులు కె.సిద్దు బుట్టాయగూడెంలో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో నాయకులు జి.వినరు, వి.సురేంద్ర, ఎం.బాలు, పి.పవన్‌, విద్యార్థులు పాల్గొన్నారు.
ముసునూరు : మండలంలో విద్యాసంస్థల బంద్‌ విజయవంతంగా సాగింది. ఈ సందర్భంగా సిపిఎం మండల కార్యదర్శి వేముల బక్కయ్య మాట్లాడుతూ అనేక పోరాటాలు, ప్రాణ త్యాగాలతో ఏర్పడిన విశాఖ ఉక్కును మోడీ ప్రభుత్వం అమ్మాలని చూడటం దుర్మార్గమన్నారు. ఈ బంద్‌కు వామపక్ష పార్టీలు మద్దతు తెలిపాయి. ఈ కార్యక్రమంలో అఖిలభారత ప్రగతిశీల మహిళా సంఘం మండల కమిటీ సభ్యులు పల్లిపాము భవాని, ఆముదాల చినబాబు, బాబూరావు , కొడవలి శ్రీను, కంచర్ల రమేష్‌, విద్యార్థులు పాల్గొన్నారు.
జీలుగుమిల్లి : విద్యాసంస్థల బంద్‌ మండలంలో ప్రశాంతంగా ముగిసింది. ప్రయివేటు, ప్రభుత్వ పాఠశాలలు మూతపడ్డాయి. పిడిఎస్‌యు, పివైఎల్‌ విద్యార్థి సంఘాలు బంద్‌లో పాల్గొన్నాయి. ఈ సందర్భంగా పిడిఎస్‌యు నాయకులు అజరు, పివైఎల్‌ డివిజన్‌ కమిటీ నాయకులు కట్టం నాగేశ్వరరావు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో పివైఎల్‌ నాయకుల కట్టం శ్రీరామరాజు, ఎస్‌కె.షాదీష్‌, డి.రాజు, పి.నరసయ్య, పిడిఎస్‌యు నాయకులు బి.సాయి, పి.శ్రీను పాల్గొన్నారు.
కలిదిండి : మండలంలో విద్యాసంస్థల బంద్‌ సంపూర్ణంగా సాగింది. ప్రభుత్వ, ప్రయివేటు పాఠశాలలు మూతబడ్డాయి.
నూజివీడు రూరల్‌: నూజివీడు పట్టణంలో విద్యాసంస్థల బంద్‌ విజయవంతమైంది. ప్రభుత్వ, ప్రయివేటు విద్యాసంస్థలు మూతపడ్డాయి. ప్రయివేటు విద్యాసంస్థలు స్వచ్ఛందంగా స్కూళ్లు, కాలేజీలు మూసివేసి బంద్‌కు సహకరించారు.
కొయ్యలగూడెం : మండలంలో బంద్‌ ప్రశాంతంగా సాగింది. ప్రయివేటు విద్యాసంస్థలు స్వచ్ఛందంగా స్కూళ్లు, కాలేజీలు మూసివేశాయి. ఈ కార్యక్రమంలో వివిధ విద్యార్థి సంఘాల నాయకులు మాట్లాడుతూ ఎంతోమంది త్యాగధనుల కృషి ఫలితమే విశాఖ ఉక్కు అని, దాన్ని భవిష్యత్‌ తరాలకు అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో పిడి ఎస్‌యు నాయకులు ఉదరుకుమార్‌, టిఎన్‌ఎస్‌ఎఫ్‌ అధికార ప్రతినిధి పారేపల్లి పవన్‌, ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా అధ్యక్షులు రామ్‌ప్రసాద్‌, యువజన కాంగ్రెస్‌ జిల్లా అధ్యక్షులు అమిరిశెట్టి దిలీప్‌, ఎఐఎస్‌ఎఫ్‌ మండల నాయకులు సజ్జ నాగేంద్ర, ఎన్‌ఎస్‌యుఐ మండల అధ్యక్షులు కె.లక్ష్మణ, పివైఎల్‌ నాయకులు ప్రసాద్‌, విద్యార్థి నాయకులు మురళీ, చందు, శివ, మనోజ్‌, సతీష్‌ పాల్గొన్నారు.