
ట్రాన్స్ఫార్మర్ పగలగొట్టి
రాగి వైర్లు చోరీ
ప్రజాశక్తి - గంగాధరనెల్లూరు
మండలంలోని నూతన గణేష్ పురం గ్రామంలో ఓ రైతుకు చెందిన ట్రాన్స్ఫార్మర్ను పగలగొట్టి అందులోని రాగి వైర్లను చోరీ చేసుకుని వెళ్ళిన సంఘటన జరిగింది. ఇందుకు సంబంధించి బాధ్యత రైతు తెలిపిన కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. మండలంలోని ఆంబోదరపల్లి పంచాయతీ నూతన గణేష్ పురం గ్రామంలో గల గోవిందరెడ్డి కుమారుడు రామస్వామిరెడ్డికి చెందిన పొలంలో సోమవారం అర్ధరాత్రి ట్రాన్స్ఫార్మర్ను విద్యుత్ స్తంభం నుంచి దించేసి పగలగొట్టకుండా వెళ్లిపోయారన్నారు. దీంతో ఆవలకొండలో విద్యుత్ అధికారులకు సమాచారం ఇచ్చామని, వారు సంఘటన స్థలానికి వచ్చి చూసి ఉన్నతాధికారులకు స్థానిక విద్యుత్ అధికారులు సమాచారం చేరవేశారని తెలిపారు. అయితే మంగళవారం అర్ధరాత్రి యథాప్రకారంగా గుర్తుతెలియని వ్యక్తులు మళ్ళీ ఆ చోటికి వచ్చి కిందపడదోసిన ట్రాన్స్ఫార్మర్ పగలగొట్టి అందులోని రాగివైర్లను చోరీ చేసుకుని వెళ్లినట్టు బుధవారం ఉదయం బాధిత రైతు కుటుంబంలోని సభ్యులు పొలం దగ్గర వెళ్ళినప్పుడు గుర్తించామన్నారు. ఈవిషయం తెలిసిన వెంటనే విద్యుత్శాఖ అధికారులు, పోలీసులకు బుధవారం ఫిర్యాదు చేసినట్లు రైతు పేర్కొన్నారు.