
ప్రజాశక్తి-అమలాపురం
కొబ్బరి ఉత్పత్తులు మరియు మత్స్య సంపద ఉత్పత్తులు 35 కేజీల వరకు ఇతర దేశాలకు తపాలా శాఖ ద్వారా ఎగుమతి చేసేందుకు స్థానిక కోనసీమ తపాలా శాఖ కార్యాలయాన్ని ఎంపిక చేశామనిజిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లా అన్నారు. శనివారం స్థానిక కలెక్టరేట్ నందు జిల్లా పరిశ్రమల శాఖ, వాణిజ్య ఎగుమతుల ప్రమోషన్ సంయుక్తంగా కొబ్బరి ఉత్పత్తుల తయా రీదారులు మరియు రైతు ఉత్ప త్తిదా రుల ప్రతి నిధులతో జిల్లా స్థాయిలో సంప్రదింపుల సమావేశం జిల్లా కలెక్టర్ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సం దర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ గ్లోబలైజేషన్ మార్కెట్లో వినియో గదారులు ఆసక్తి చూపుతున్న కొబ్బరి వస్తువుల డిమాండ్కు అనుగుణం గా కొబ్బరి ఆధారిత ఉత్పత్తుల తయారీపై ఉత్పత్తిదారులు దృష్టి సారించాలన్నారు. క్షేత్రస్థాయిలో కొబ్బరి ఉత్పత్తుల తయారీ అమ్మకాల ప్రక్రియల్లో ఇబ్బందులను ప్రతినిధుల సమక్షంలో గుర్తించి, జిల్లాస్థాయి ఎగుమతుల హబ్ కార్యా చరణ రూపొందించి కేంద్రంతో టైయప్ చేసి అంతర్జాతీయంగా మార్కెటింగ్ సౌలభ్యం కల్పించాలని, కొబ్బరి మరియు మత్స్యసంపద ఉత్పత్తిదారులకు గిట్టుబాటు ధరలు కల్పించే ఉద్దేశంతో ఈ సమావేశాన్ని నిర్వహించామన్నారు. కొబ్బరి ఉత్పత్తిదారులతో ఎగుమతుల కొరకు ఫెడరేషన్ ఆర్గనైజేషన్ ద్వారా ఉత్పత్తులకు లాభదాయకమైన మార్కెటింగ్ సౌలభ్యం కల్పిస్తారన్నారు. కోకోనట్ బోర్డు వారు కొబ్బరి ఉత్పత్తులపై వాటి ద్వారా లభించే పోషక విలువలపై సమాజంలో ప్రతి ఒక్కరికి అవగాహన పెంపొందించాలన్నారు. 35 కేజీలు దాటిన ఉత్ప త్తులను కార్గో లాజిస్టిక్స్ కంటైనర్ల ద్వారా విదేశాలకు రవాణా చేసే అవకాశం ఉందన్నారు. కొబ్బరి ఉత్పత్తిదారుల, రైతు ఉత్పత్తిదారుల నుండి తీసుకున్న అభిప్రాయాలను క్రోడీకరించి జిల్లా స్థాయి ఎగుమతులు హబ్ కొరకు కార్యకరణ సిద్ధం చేసి కేంద్ర ప్రభుత్వానికి నివేదిస్తామని పరిశ్రమల శాఖ ఎగుమతులు విభాగం సంయుక్త సంచాలకులు జిఎస్.రావు తెలిపారు. ఎగుమతుల ప్రతినిధి రఘునాథ్ బాబు మాట్లాడుతూ ఏపీ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఎక్స్పోర్ట్స్ ఆర్గనైజేషన్ ద్వారా ఉత్పత్తుల ఎగుమ తులకు సంబంధించిన అంశాలపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా అవగా హన పెంపొందించారు. కార్గో రవాణా లాజిస్టిక్స్ కు సంబంధించిన ప్రతినిధి శంకర్ కూడా రవాణా సౌలభ్యంపై విశదీకరించారు. కార్యక్రమంలో జిల్లా పరిశ్రమల కేంద్రం జనరల్ మేనేజర్ పికెపి.ప్రసాదు, సహాయ సంచాలకులు శివరాం ప్రసాద్, కొబ్బరి ఉత్పత్తిదారుల సంఘాల ప్రతినిధులు జిల్లాలో క్వాయర్, కోకో పిట్ తయారీదారులు తదితరులు పాల్గొన్నారు.
అభివృద్ధి కార్యక్రమాలపై సిఎస్ సమీక్ష
రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.ఎస్ జవహర్ రెడ్డి హైదరాబాద్ నుంచి శనివారం 26 జిల్లాల కలెక్టర్లతో వీడియోకాన్ఫరెన్స్ ఏర్పాటు చేశారు. ఈసందర్భంగా వైఎస్ఆర్ జగనన్న శాశ్వత భూహక్కు భూ రక్ష రీ సర్వే, జాతీయ రహదా రులకు భూసేకరణ, మల్టీ పర్పస్ ఫెసిలిటేటెడ్ గోదాముల నిర్మాణా నికి స్థల సేకరణ, వ్యవసాయం పశుసంవర్ధనం డైరీ డెవల ప్మెంట్ జగనన్న పాల వెల్లువ, చిరుధా న్యాలు సాగు ప్రోత్సాహం, గహ నిర్మాణాలు నివేశన స్థలాలు పట్టాలు జారీ, ప్రభుత్వ ప్రాధాన్యత భవనాలు తదితర అంశాల పురోగతిపై సమీక్షించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ అనంతరం జిల్లా కలెక్టర్ అధికారులను ఉద్దేశించి మాట్లాడుతూ జిల్లాలో కొబ్బరి సముద్ర ఉత్పత్తులు ముడి సరు కుగా ఉండే పరిశ్రమల నెలకొ ల్పేం దుకు విస్తతమైన చర్యలు చేపట్టా లని సూచించారు. రాయ వరం మండలం మాచవరంలో క్లస్టర్ డెవలప్మెంట్ కింద కమ్యూనిటీ ఫెసిలిటేషన్ కేంద్రాన్ని పప్పుధా న్యాల ప్రాసెసింగ్ పై నెలకొల్పడం జరిగిందని త్వరలో ప్రారంభం కానున్నదన్నారు. రబీ సాగుకు సన్నద్ధం అయ్యేందుకు విత్తనాలు రాయితీపై అందించేం దుకు చర్యలు చేపట్టాలన్నారు. అపరాల సాగుకు అవకాశం ఉన్న సాగు క్షేత్రాలను గుర్తించి రాయి తీలతో ప్రోత్సహించాలన్నారు. రబీ సాగుకు సాగునీటి ఇబ్బంది సమస్యలు తలెత్తకుండా చర్యలు చేపట్టాలని సూచించారు. ప్రభుత్వ ప్రాధాన్యత భవనాలను త్వరితగతిన పూర్తి చేసి ఆయా వసతులను గ్రామస్థాయిలో పరి పాలనా సౌలభ్యం కొరకు అందు బాటులో తేవాలని ఆదేశించారు. కార్యక్రమంలో జిల్లా జాయింట్ కలెక్టర్ ఎస్.నుపూర్ అజరు, డిఆర్ఒ సిహెచ్.సత్తిబాబు ఆర్డిఒ జి.కేశవర్ధన రెడ్డి, సిపిఒ వెంకటేశ్వర్లు డిఆర్డిఎ పీడీ డాక్టర్ బి.శివ శంకర్ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.