Nov 11,2023 21:26

ప్రజాశక్తి-పెద్దపంజాణి: ఎలాంటి అనుమతులు లేకుండా విక్రయిస్తున్న టపాకాయలును స్వాధీనం చేసుకున్నట్లు సిఐ కృష్ణమోహన్‌ తెలిపారు. శనివారం వివరాలను వెల్లడించారు. మండలంలోని నిడిగుంట గ్రామానికి చెందిన చిన్నరెడ్డెప్ప, కిరణ్‌కుమార్‌ లైసెన్సు లేకుండా టపాకాయలు విక్రయిస్తున్నారన్న సమాచారం దాడులు నిర్వహించామన్నారు. సుమారు రూ.2,59,629 విలువైన టపాకాలయలను ఇంటిలో ఉంచుకొని అమ్ముతున్నట్లు గుర్తించి సీజ్‌ చేశామన్నారు. స్థానిక ఎస్‌ఐ శ్రీనివాసులు, సిబ్బంది దాడుల్లో పాల్గొన్నారు.