Oct 27,2023 22:59

ప్రజాశక్తి-ముమ్మిడివరం
ముమ్మిడివరం నగర పంచాయతీ కౌన్సిల్‌ సమావేశం సందర్భంగా తొలగించిన పారిశుధ్య కార్మికులను వీధిలోని తీసుకోవాలని సిఐటియు ఆధ్వర్యంలో నగర పంచాయతీ చైర్మన్‌ కమిడి ప్రవీణ్‌కు, కౌన్సిలర్‌ ములపర్తి బాలకృష్ణకు, బొంతు శ్రీనివాస్‌కు మరియు వార్డు కౌన్సిలర్‌కు శుక్రవారం వినతి పత్రాలు సమర్పించారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా కార్యదర్శి జి.దుర్గాప్రసాద్‌ పాల్గొని ఛైర్మన్‌ కమిడి ప్రవీణ్‌తో మాట్లాడుతూ కరోనా సమయంలో ముమ్మిడివరం పట్టణ ప్రజలకు సేవలందించిన కార్మికులను తొలగించడం బాధాకరమన్నారు. నగర పంచాయతీ 20 వార్డులు, 50 మంది పైగా పారిశుధ్య పనులు చేయుటకు కార్మికుల అవసరమన్నారు. ముమ్మిడివరం పట్టణ ప్రజలు డ్రైన్‌ పన్ను , చెత్త పన్ను, ఇంటి పన్ను చెల్లిస్తున్నారని ప్రజలకు మెరుగైన సేవలు అందించాలంటే సిబ్బంది పెంచాలన్నారు. ఇప్పటికే అనేక చోట్ల డ్రైన్‌ లేకపోవడం, చెత్త పేరుకుపోవడం వలన ప్రజలు ఇబ్బంది గురవుతున్నారన్నారు. ఇవన్నీ దష్టిలో పెట్టుకొని కార్మికులను విధుల్లో తీసుకుని ప్రజలకు మెరుగైన సేవలు అందించే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు. ఛైర్మన్‌ మాట్లాడుతూ కౌన్సిల్‌ సమావేశంలో దీనిపై చర్చిస్తామని హామీ ఇచ్చారు.కార్యక్రమంలో బోంగు వెంకటరమణ, పలివెల ప్రసాద్‌, నిమ్మకాయల మహాలక్ష్మి, మాణిక్యం గంగా, వ్యవసాయకార్మిక సంఘం నాయకులు పాము బాలయ్య, సిఐటియు ముమ్మిడివరం అధ్యక్షులు నిమ్మకాయల వెంకటేష్‌ తదితరులు ఉన్నారు .