
ప్రజాశక్తి - టి.నరసాపురం
విద్యార్థులు తెలుగు భాష పట్ల ఆశక్తి పెంచుకోవాలని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల తెలుగు ఉపాధ్యాయులు కె.కుటుంబరావు తెలిపారు. స్థానిక శాఖా గ్రంథాలయంలో 56వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలలో భాగంగా శనివారం వ్యాస రచన, నీతి పద్యాల పోటీలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన కుటుంబరావు మాట్లాడుతూ విద్యార్థులు తెలుగు భాష పట్ల ఆసక్తి, పదజాల అభివృదద్ధి, నీతి పద్యాల ద్వారా నైతిక విలువలు, పెద్దల పట్ల వినయవిధేయతలు, క్రమశిక్షణ నేర్చుకోవాలని తెలిపారు. అనంతరం గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో శాఖా గ్రంథాలయ ఛైర్మన్ నల్లూరి శ్రీనివాసరావు, గ్రంథాలయ పాలకులు ఆర్.కిషోర్, విజన్ యుపి స్కూల్ కరస్పాండెంట్ పురం శ్రీనివాస్, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల వ్యాయమ ఉపాధ్యాయులు కె.రాజు, సాయి సూర్య హైస్కూల్ కరస్పాండెంట్ కె.పవన్ కుమార్, హిందీ ఉపాధ్యాయులు షేక్ యాకూబ్, వలి పాల్గొన్నారు.
ఏలూరు : విద్యార్థి దశలో ప్రతిఒక్కరూ ఏదో ఒక కళలో నైపుణ్యం సాధించాలని, వారిలో దాగి ఉన్న ప్రతిభను గుర్తించాలని అవి మానసిక ఆనందాన్ని కలిగిస్తాయని కళారత్న సుజరు కృష్ణ తెలిపారు. బాలల గ్రంథాలయంలో వారోత్సవాల్లో భాగంగా ముఖ్యఅతిథిగా ఆయన విచ్ఛేసి మాట్లాడారు. అనంతరం విద్యార్థులకు డ్రాయింగ్ కాంపిటీషన్ నిర్వహించారు. ఈ పోటీలో దాదాపు 100 మంది విద్యార్థుల వరకు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో లాయర్ జిల్లెల్లమూడి వరప్రసాద్, వివిధ పాఠశాలల ఉపాధ్యాయులు, పాఠకులు, గ్రంథాలయ నిర్వాహకురాలు ఎమ్.శోభ, రికార్డు అసిస్టెంట్ ఎం.కీర్తి పాల్గొన్నారు.