Nov 06,2023 19:31

ప్రజాశక్తి - ద్వారకాతిరుమల
   మండలంలోని గుణ్ణంపల్లి గ్రామంలో గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న టైలర్‌ యడ్లపల్లి నటరాజ్‌(కృపా టైలర్స్‌)కు ద్వారకాతిరుమల టైలర్‌ సంఘం వారు ఆర్థిక సహాయం అందించారు. కిడ్నీ, లివర్‌ కంప్లైంట్‌, మూత్రం నుంచి రక్తప్రసరణ ఇటువంటి వాటితో బాధపడుతున్న విషయం తెలుసుకుని వైద్యం నిమిత్తం ఆర్థిక సహాయం రూ.12,320 అందజేశారు. ఆపదలో ఉన్న టైలర్‌ని ఆదుకోవడానికి టైలర్స్‌ గ్రూపు ఎప్పుడు ముందుంటుందని టైలర్‌ నేలటూరి సత్యనారాయణ తెలిపారు. ఈ కార్యక్రమం టైలర్స్‌ సయ్యద్‌ సలీం, షేక్‌ పెటు సాహెబ్‌, గుడివాడ అంజలీదేవి, కండవల్లి దివ్యవాణి, ఎస్‌పి రాము, తమ్మిశెట్టి వెంకటరమణ పాల్గొన్నారు.