Oct 27,2023 10:50

ప్రజాశక్తి-మండపేట : లారీ ఢీకొని బాలుడు మృతి చెందిన సంఘటన మండపేట సత్య శ్రీ రోడ్డులో చోటుచేసుకుంది. పోలీసులు, బంధువులు, స్థానికులు, తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. స్థానిక సంఘం కాలనీలో నివాసం ఉంటున్న కోనే శ్రీను మంగ దంపతులకు కుమార్తె, కుమారుడు ఉన్నారు. కుమారుడు మహేష్ (13) స్థానిక సత్య శ్రీ రోడ్డులోని ఎస్ ఎస్ వి వి మున్సిపల్ హై స్కూల్ లో తొమ్మిదో తరగతి చదువుతున్నాడు. రోజువారి క్రమంలో భాగంగా ఇంటి నుంచి స్కూలుకు వెళుతుండగా సత్య శ్రీ రోడ్ లోని కోళ్ల ఫారం ఎదురుగా దుప్పలపూడి నుంచి మండపేట వస్తున్న లారీ ఢీకొనడంతో బాలుడు అక్కడికక్కడే మృతి చెందాడు.