Oct 28,2023 12:23
  • దళిత సంఘాలు డిమాండ్

ప్రజాశక్తి-మామిడికుదురు : రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ వర్గాల విషయంలో చేస్తున్న అబద్ధపు ప్రచారాన్ని ఆపాలని దళిత సంఘాలు డిమాండ్ చేసాయి.  పెదపట్నంలో విశ్రాంత సోషల్ వెల్ఫేర్ ఆఫీసర్ భూపతి వెంకటపతి గృహం వద్ద దళిత చైతన్య వేదిక సమన్వయ కర్త బత్తుల జనార్దనరావు అధ్యక్షతన శనివారం దళిత నాయకుల సమావేశం జరిగింది. నాయకులు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ నిధులను, ఎస్సీ కార్పొరేషన్ నిధులను ప్రభుత్వ పథకాలకు మళ్లించుకుని దళితల నోట్లో మట్టి కొట్టిందని ఆవేదన వ్యక్తం చేశారు. రాజ్యాంగ బద్దంగా ఎస్సీలకు రావాల్సిన 27 ఎస్సీ సంక్షేమ పథకాలను రద్దు చేసిందని తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు అన్నీ వర్గాలతో పాటుగా ఎస్సీ ఎస్టీ వర్గాలకు అందుతున్నాయని, ఎస్సీ ఎస్టీలకు ప్రత్యేకంగా ఒరగబెట్టింది ఏది లేదన్నారు. రాజ్యాంగ బద్దంగా దళితులకు రావాల్సిన నిధులు, రాయితీలు, హక్కులు ఈ రాష్ట్రంలో నిర్వీర్యమైపోయాయన్నారు. దళితుల నిధులను దళితేతరలకు పంచిపెట్టి దళితులను ఉద్ధరించామంటూ ప్రచారం చేయ్యడం తగదన్నారు. దళితల కంటూ ఈ రాష్ట్రంలో ప్రవేశపెట్టిన పధకమంటూ ఏది లేదన్నారు. నిర్వీర్యమైపోయిన సబ్ ప్లాన్ నిధులను, కార్పొరేషన్ నిధులను, సంక్షేమ పథకాలను వెంటనే పునరుద్ధరణ చేయ్యాలని రాష్ట్ర ప్రభుత్వాని మరోసారి డిమాండ్ చేస్తున్నట్లు తెలిపారు. హక్కులను తిరిగి సాదించడం కోసం రాజకీయ పార్టీలకు అతీతంగా దళితులందరూ పోరాటానికి సిద్ధం కావాలని దళిత నాయకులు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో  మండల అంబేడ్కర్ యువజన సంఘ అధ్యక్షులు కలిగితి పళ్ళంరాజు, మండల ఎంపీటీసీల సమాఖ్య అధ్యక్షుడు నెల్లి దుర్గా ప్రసాద్, దళిత చైతన్య వేదిక వ్యవస్థాపకుడు బత్తుల మురళీకృష్ణ, పీడియం రాష్ట్ర నాయకులు దీపాటి శివ ప్రసాద్, దళిత ఆదివాసీ రాష్ట్ర అధ్యక్షులు చిలకపాటి శ్రీధర్, బొడ్డపల్లి పుల్లయ్య, భూపతి కృష్ణ, బత్తుల జనార్ధనరావు, తదితరులు పాల్గొన్నారు.