అసమానతలు లేని అభివద్ధి కోసం సిపియం ఆధ్వర్యాన ప్రజారక్షణ భేరి బస్సు యాత్ర అక్టోబర్ 30వ తేదీన ప్రారంభం కానుంది. సోమవారం పార్వతీపురం జిల్లా సీతంపేట వద్ద నుండి ఏజెన్సీ జాతా పేరుతో బస్సు యాత్రం ప్రారంభం కానుంది. ఈ బస్సు యాత్రను సిపిఎం పొలిట్ బ్యూరో సభ్యులు బి.వి రాఘవులు ప్రారంభించనున్నారు. అలాగే కర్నూలు ఆదోనీ నుండి మరో బస్సు యాత్ర ప్రారంభం కానుంది. ఈ యాత్రను సిపిఎం పొలిట్బ్యూరో సభ్యులు అశోక్ధావలే ప్రారంభించనున్నారు.












