Sep 16,2023 11:47

ప్రజాశక్తి-కర్నూలు క్రైమ్ : పోలీసు నియామక పక్రియలో భాగంగా రాయలసీమ జోన్ కు  సంబంధించి ఎస్సై ఉద్యోగాల ప్రాథమిక రాత పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్ధులకు  కర్నూలు  APSP -2-వ   బెటాలియన్ లో 17 వ రోజు దేహదారుడ్య  పరీక్షలు  కొనసాగుతున్నాయి. ఈ దేహాదారుడ్య సామర్థ్య పరీక్షలను కర్నూలు రేంజ్ డిఐజి ఎస్. సెంథిల్ కుమార్, కర్నూలు జిల్లా ఎస్పీ జి. కృష్ణకాంత్, సెబ్ అడిషనల్ ఎస్పీ శ్రీ కృష్ణ కాంత్ పటేల్  పర్యవేక్షిస్తున్నారు. 800 మంది అభ్యర్దులకు గాను ఇప్పటివరకు 810 మంది అభ్యర్దులు హజరయ్యారు. వీరికి సర్టిఫికెట్స్ వెరిఫికేషన్ తర్వాత బయోమెట్రిక్, ఎత్తు, ఛాతి  వంటి ఫిజికల్ మెజర్మెంట్ టెస్టులు నిర్వహించారు. వీరందరికీ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ లు 1600 మీటర్ల పరుగు, 100 మీటర్ల పరుగు, లాంగ్ జంప్  పరీక్షలు   నిర్వహిస్తున్నారు.