అవార్డును చూపుతున్న రత్నాకర్, తదితరులు
ప్రజాశక్తి - పుట్టపర్తి రూరల్ : శ్రీ సత్యసాయి సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి సిబ్బందికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక అవార్డు, ప్రశంసా పత్రాన్ని అందజేసింది. పర్యావరణాన్ని పరిరక్షించడంలో శ్రీ సత్య సాయి సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి సిబ్బంది తీసుకున్న చొరవకు గుర్తింపుగా విజయవాడలో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో రాష్ట్ర అటవీ, పర్యావరణ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చేతుల మీదుగా అవార్డును శ్రీ సత్య సాయి సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి చైర్మన్ గురుమూర్తికి అందజేశారు. అవార్డు రావడం పట్ల చైర్మన్ గురుమూర్తిని ఆసుపత్రి సిబ్బందిని శ్రీ సత్య సాయి సెంట్రల్ ట్రస్ట్ సభ్యులు రత్నాకర్ అభినందించారు.










