
స్పందన అర్జీలపై ప్రత్యేక దృష్టి పెట్టండి: జెసి
ప్రజాశక్తి- కార్వేటినగరం: ప్రజాసమస్యల పరిష్కారమే జగనన్నకు చెబుదాం కార్యక్రమం లక్ష్యమని జిల్లా జాయింట్ కలెక్టర్ (రెవెన్యూ) శ్రీనివాసులు అన్నారు. బుధవారం మండల కేంద్రంలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామితో కలసి ఎంపీపీ లత, సర్పంచ్ ధనంజయవర్మ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన జగనన్నకు చెబుదాం కార్యక్రమంలో జేసీ మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై ఇచ్చిన సమస్యలను పరిశీలించి వెంటనే పరిష్కారం చేసేందుకు ప్రభుత్వం జగనన్నకు చెబుదాం తీసుకొచ్చిందన్నారు. గ్రామాల్లో కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా ప్రభుత్వం ఏర్పాటు చేసిన గ్రామ సచివాలయాల పరిధిలో పరిష్కారం కాని సమస్యలను మండల స్థాయి అధికారుల పరిష్కరించాలని, అలా లేని జఠిలమైన సమస్యలైతే జిల్లా స్థాయిలో ఏర్పాటు చేసే సందన కార్యక్రమానికి తీసుకు రావాలన్నారు. గ్రామీణలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించడానికి ప్రభుత్వం శుక్రవారాల్లో రెండు రోజులు పాటు జిల్లాలో ఏదో ఒక మండలం ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. చిన్నపాటి సమస్యలను వ్యయప్రయాశాలకోర్చి జిల్లా కేంద్రాలకు కూడా రావడం మానుకోవాలని సూచించారు. పరిష్కారం కాని భూతగాదాలు ఉన్న వారు కోర్టును ఆశ్రయించాలని పేర్కొన్నారు. గ్రామీణ ప్రాంతాల్లోని సమస్యలను పరిష్కరించడంలో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. మండల స్థాయిలో నిర్వహించే కార్యక్రమం ద్వారా జిల్లా అధికారులు పాల్గొనడంతో సమస్యలను అక్కడిక్కడే పరిష్కరించే ఆస్కారం ఉంటుందన్నారు. స్పందన కార్యక్రమంలో అందే సమస్యలను 15రోజుల లోపే పరిష్కరించాలని ఆదేశించారు. గ్రామీణ, మండలస్థాయి అధికారులు సమన్వయంతో పనిచేసి సమస్య రహిత మండలాలుగా చూడాలన్నారు. ప్రతి సమస్యకు పరిష్కారం చూపాలన్నదే ప్రభుత్వ ధ్యేయమన్నారు. గ్రామాల్లో నుంచే రెవెన్యూ సమస్యలు గ్రీవెన్సుకు వస్తున్నాయని, అలా కాకుండా అర్జీదారులకు మండల స్థాయి నుంచే పరిష్కారం చేపేలా చూడాలని తెలిపారు. కుటుంబ వ్యవహారాలు వంటి సమస్యలు కోర్టులో పరిష్కరించుకోవాలని చెప్పారు. జగనన్నకు చెబుదాం కార్యక్రమానికి అన్ని శాఖలకు సంబందించి 175 వినతులు వచ్చినట్లు అధికారులు తెలిపారు. ఇందులో రెవెన్యూకు సంబంధించి 120 వినతులు వచ్చాయి. డీఆర్డీఏ ద్వామా పీడీలు తులసి, గంగాభవాని, జిల్లా రిజిస్టర్ శ్రీనివాస్, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి మురళీకష్ణ, ఏపీఎంఐపీ పీడీ ఈ.రమణారెడ్డి, జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి డాక్టర్ ప్రభాకర్, డీఈవో విజయేంద్రరావు, ఆర్డీవో సుజన, సమగ్రశిక్ష ఏపీసీ వెంకట రమణారెడ్డి, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ డాక్టర్ రాజ్యలక్ష్మి, రబ్బానీ బాషా, చిన్నారెడ్డి, నరసింహులు, జిల్లా భూగర్భ జలాల అధికారి గోవర్ధన్రెడ్డి, డీటీసీ నిరంజన్రెడ్డి, డీపీవో లక్ష్మి, డీఎస్వి శంకరన్, డీఎం సివిల్ సప్లేస్ మోహన్ బాబు, ఎల్డీఎం హరీష్, జిల్లా ఇమ్యూనిజేషన్ అధికారి డాక్టర్ రవిరాజు, తహసీల్దార్ రవికుమార్, ఎంపీడీవో మోహన్ మురళి పాల్గొన్నారు.
జెసికి జనసేన వినతి
వెదురుకుప్పం: నియోజకవర్గం పరిధిలో ఉన్న కార్వేటినగరం మండలాన్ని తిరుపతి జిల్లాలో కలపాలని బుధవారం జనసేన పార్టీ నాయకులు జాయింట్ కలెక్టర్కి వినతిపత్రం సమర్పించారు. నియోజకవర్గ బాధ్యులు పొన్న యుగంధర్ మాట్లాడుతూ కార్వేటినగరం మండలాన్ని తిరుపతి జిల్లాకు కేవలం 30కిలోమీటర్లు సమీపంలో తుడా పరిధిలో ఉందని, ఈ మండలాన్ని తిరుపతి జిల్లాలో కలిపితే ప్రజలందరికీ సౌకర్యమని పేర్కొన్నారు. మండల అధ్యక్షులు శోభన్బాబు, రాజేష్, రాఘవ, నరేష్, విజరు, సూర్య నరసింహులు, వెంకటేష్, భానుచంద్రారెడ్డి ఉన్నారు.