
ప్రజాశక్తి-మామిడికుదురు
గ్రామాల్లో ప్రధాన సమస్యలు పరిష్కారంలో స్థానిక ప్రజాప్రతినిధులకు అధికారులు సహకరించాలని పి.గన్నవరం ఎంఎల్ఎ కొండేటి చిట్టిబాబు కోరారు. ఎంపిపి కుసుమ వనజకుమారి అధ్యక్షతన మంగళవారం మామిడికుదురు మండల పరిషత్ సర్వసభ్య సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఎంఎల్ఎ మాట్లాడుతూ జగనన్న ఇళ్ల స్థలాలు వచ్చే నెలలో కేటాయించి కాలనీలలో మౌలిక వసతులు కల్పనపై దృష్టి సారిస్తామన్నారు. పాశర్లపూడి, మాకనపాలెం లలో వోల్టేజ్ సమస్యతో ఇబ్బందులు పడుతున్నామని విద్యుత్ బిల్లులు కట్టించుకుంటున్న శ్రద్ధ మౌలిక వసతులపై దష్టి సాధించడంలేదని ఎలక్ట్రికల్ ఎఇ తీరుపై ఎంపిటిసి సభ్యుడు అంకాని వీరాంజనేయులు ధ్వజమెత్తారు. స్టాంపు డ్యూటీ పంచాయతీలకు జమ కాకపోవడంతో నిధులేమితో ఏ పనులు చేయలేని నిసహాయ స్థితిలో ఉన్నామని సర్పంచుల సమాఖ్య అధ్యక్షులు ఆడబాల తాతకాపు విన్నవించారు. గోగన్నమఠం, పెదపట్నంలంక రూట్లలో నిలిచిపోయిన ఆర్టిసి సర్వీసులు పునరుద్ధరిచాలని జెడ్పిటిసి సభ్యుడు అంజిబాబు ఆర్టిసి అధికారులకు విన్నవించారు. ప్రతి సమావేశానికి గైహజరవుతున్న అధికారులపై చర్యలు కాన రావడం లేదని ఎంపిటిసి సభ్యులు వాపోయారు. ఈ కార్యక్రమంలో వైస్ ఎంపిపి పిల్లి శ్రీలక్ష్మి, డిప్యూటీ తహశీల్ధార్ ఎం.శరణ్య, పరిపాలనాధికారి కారుపల్లి వెంకటేశ్వరరావు, తదితరులు పాల్గొన్నారు.
పేదలకు చీరల పంపిణీ
మామిడికుదురు విజయదశమి పర్వదినం సందర్భంగా పి.గన్నవరం తాటికాయలవారిపాలెంలో కనకదుర్గమ్మ వారిని ఎంఎల్ఎ కొండేటి చిట్టిబాబు మంగళవారం దర్శనం చేసుకున్నారు. మాజీ ఎంపిటిసి సభ్యురాలు తాటికాయల దేవి, మధు దంపతులు సమకూర్చిన చీరలను 100 మంది పేద మహిళలకు అందజేశారు.ఈ కార్యక్రమంలో సర్పంచ్ల సమాఖ్య అధ్యక్షులు తోలేటి బంగారునాయుడు, దొమ్మేటి దుర్గారావు, అడ్డగళ్ళ సాయిరాం, పెచ్చెట్టి రాంబాబు, బోయపాటి సాయి, కుడిపూడి రాము, తదితరులు పాల్గొన్నారు..