Nov 09,2023 21:41

స్కానింగ్‌ సెంటర్లలో తనిఖీలు
ప్రజాశక్తి- చిత్తూరుఅర్బన్‌:
జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్‌ ఓ ప్రభావతి దేవి ఆదేశాల మేరకు పిసిపి ఎన్‌డిటి నోడల్‌ అధికారి డాక్టర్‌ రవిరాజు చిత్తూరు నగర పరిధిలోని వివిధ స్కానింగ్‌ సెంటర్‌లను ఆకస్మిక తనిఖీ చేశారు. 'గర్భస్థ లింగ నిర్దారణ చట్టరీత్యా నేరం' నగర పరిధిలోని వివిధ స్కానింగ్‌ సెంటర్లను, హాస్పిటల్‌, న్యూమెట్రో హాస్పిటల్‌ తనిఖీ చేసి పలు సూచనలు చేశారు. ఎట్టి పరిస్థితిలోనూ గర్భవతులకు లింగ నిర్ధారణ తెలియపరచకూడదని, అలా తెలియజేసినట్లు రుజువైతే పిసిపిఎన్‌డిటి 1994ప్రకారం చట్టరీత్యా నేరమని, అటువంటి వారికి రూ.10వేలు జరిమనా, మూడు సంవత్సరాల జైలు శిక్ష సదరు డాక్టర్‌కి, అక్కడ పనిచేసిన నర్సుకి, గర్భవతికి, వారి వెంట వచ్చిన వారికి శిక్ష తప్పదని హెచ్చరించారు. కార్యక్రమంలో ఎస్‌ఓ జార్జ్‌ పాల్గొన్నారు.