
టి.నరసాపురం : మండలంలోని అప్పలరాజుగూడెంలో నూతన సీసీ రోడ్ల నిర్మాణానికి జెడ్పిటిసి సభ్యులు సామంతపూడి బాల సూర్యనారాయణ రాజు శంకుస్థాపన చేశారు. గడప గడపకూ మన ప్రభుత్వం కార్యక్రమంలో గుర్తించిన సమస్యల పరిష్కారంలో భాగంగా పోలవరం నియోజకవర్గం ఎంఎల్ఎ తెల్లం బాలరాజు దృష్టికి తీసుకెళ్లడంతో రూ.20 లక్షల నిధులు మంజూరు చేశారు. ఈ సందర్భంగా జెడ్పిటిసి నిర్మాణ పనులు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో సర్పంచి జల్లా మూర్తి, ఎంపిటిసి కర్రీ రామ్ భాస్కర్ రెడ్డి పాల్గొన్నారు.