
పిడిఎఫ్ ఎంఎల్సి ఐ.వెంకటేశ్వరరావు
ప్రజాశక్తి - అమలాపురం
విద్యార్థుల్లో సైన్సు పట్ల ఆసక్తిని పెంపొందించేందుకు చెకుముకి సంబరాలు దోహదం చేస్తాయని పిడిఎఫ్ ఎంఎల్సి ఐ.వెంకటేశ్వరరావు అన్నారు. సోమవారం అమలాపురం ఎంప్లాయీస్ హోమ్లో జెవివి ఆధ్వర్యంలో నిర్వహించే చెకుముకి సంబరాలు గోడపత్రికను ఆయన ఆవిష్కరించి మాట్లాడారు. శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందించేందుకు జెవివి నిరంతరం కృషి చేస్తుందన్నారు. విద్యార్థులు చదువుతో పాటు పర్యావరణం, సమాజం పట్ల అవగాహన పెంచుకోవాలన్నారు. సైన్సును నిత్య జీవితానికి అన్వయించుకోవడం నేర్చుకోవా లన్నారు. జన విజ్ఞాన వేదిక రాష్ట్ర ఉపాధ్యక్షుడు కెవివి.సత్యనారాయణ మాట్లాడుతూ చెకుముకి సైన్సు సంబరాలు రాష్ట్ర వ్యాప్తంగా నాలుగు స్థాయిలో నిర్వహిస్తున్నామని తెలిపారు. నవంబర్ 10న పాఠశాల స్థాయి, 30న మండల/పట్టణ స్థాయి, 2024 జనవరి 27, 28 తేదీల్లో రాష్ట్ర స్థాయిలో జరుగుతాయన్నారు. ఈ అవకాశాన్ని విద్యార్థులు వినియోగించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో జెవివి పట్టణ గౌరవాధ్యక్షులు దంగుడుబియ్యం శ్రీరామ్మూర్తి, పట్నాల భాస్కరరావు, వివిఆర్కె.అర్జునరావు, పట్టణ కార్యదర్శి బిఎస్ఆర్.అప్పారావు, జిల్లా సైన్సు అండ్ టెక్నాలజీ కన్వీనర్ రాంప్రసాద్, విత్తనాల వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.