Nov 13,2023 22:24

ప్రజాశక్తి- చిత్తూరు అర్బన్‌: ప్రజల ఆశను పెట్టుబడిగా చేసుకొని కొంతమంది సైబర్‌ నేరగాళ్ళు మోసాలకు పాల్పడుతున్నారని, సైబర్‌ మోసగాళ్లు సోషల్‌ మీడియా మాధ్యమాలలో నకిలీ ప్రకటనలు చేసి అందులో డబ్బులు ఇన్వెస్ట్‌ చెయ్యమని చెప్పి మోసాలు చేస్తున్నారని జాగ్రత్తగా ఉండాలని జిల్లా ఎస్పీ రిశాంత్‌ రెడ్డి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. సైబర్‌ నేరగాళ్లు ఒక సంస్థ గా ఏర్పడి అనేక రకాలైన ఇన్వెస్టిమెంట్‌ ప్రకటనలు వివిధ సోషల్‌ మీడియా మాధ్యమాలలో ఉంచుతున్నారని, అంతేకాకుండా వాటి గురించి మీ ఫోన్స్‌కి మెసేజులు, వాట్సాప్‌ మెసేజులు, టెలిగ్రామ్‌ మెసేజులు పంపిస్తారని వాటిని చూసి మీరు ఆశపడ్డారా! సైబర్‌ నేరగాళ్లు మిమల్ని మోసం చేస్తారని హెచ్చరించారు. వాళ్ళు మిమల్ని వాళ్ళ వెబ్సైటులో ఇన్వెస్ట్‌ చేస్తే మనీ డబల్‌ వస్తాయని నమ్మించి కొంత మనీ ఇన్వెస్ట్‌ చేసి ట్రై చెయ్యండి అని చెప్తారని ఇలాంటి వాటిని నమ్మి ఇన్వెస్ట్‌ చేస్తే ఆ వెబ్సైటు మళ్ళి కనిపించదు వాళ్ళ ఫోన్స్‌ కలవు అని, ఒక వేళ ఫోన్‌ కలిసిన ఇంకొంత డబ్బులు ఇన్వెస్ట్‌ చేస్తేనే మీ డబ్బులు మీకు వస్తుందని మిమ్మల్ని నమ్మించి మోసం చేస్తారని తెలిపారు. ఇలాంటి మోసపూరిత మాటలను నమ్మొద్దు. వర్క్‌ ఫ్రొం హౌమ్‌ ఉద్యోగాలు అంటూ మీ ఫోన్స్‌కి వచ్చే మెసేజులను నమ్మకండి, ఆ మెసేజులలో ఉండే లింక్స్‌ క్లిక్‌ చెయ్యకండి. మీరు ఇలాంటి సైబర్‌ నేరానికి గురి అయినట్లు అయితే చింతించకండి వెంటనే హెల్లైన్‌ నెంబర్‌ 1930కి కాల్‌ చేసి మీ యొక్క ఫిర్యాదు నమోదు చేస్కోండని సూచించారు. సైబర్‌ క్రైమ్‌ని డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ సైబర్‌క్రైం.జిఏవి. ఇన్‌ వెబ్‌సైట్‌ నందు లేదా 1930 టోల్‌ ఫ్రీ నెంబర్‌కి ఫోన్‌ చేసి రిపోర్ట్‌ చేయాలని పేర్కొన్నారు.