Oct 11,2023 16:15
  • వ్యవసాయ కార్మిక సంఘము 

ప్రజాశక్తి-తుగ్గలి : గ్రామీణ ప్రాంతాల్లో పేదల ఉపాధి కోసం దశాబ్దాల తరబడి పోరాడి సాధించుకున్న గ్రామీణ ఉపాధి హామీ పథకానికి తూట్లు పొడిచి నిర్వీర్యం చేయాలనే కేంద్ర ప్రభుత్వం సమాయత్తం అవుతుందని వ్యవసాయ కార్మిక సంఘం మండల కమిటీ అధ్యక్ష కార్యదర్శులు శ్రీరాములు,రంగరాజు అన్నారు. అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం దేశవ్యాప్త పిలుపుమేరకు తుగ్గలి మండల కమిటీ ఆధ్వర్యంలో బుధవారం స్థానిక ఎంపీడీవో కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్రంలో బిజెపి ప్రభుత్వం వచ్చిన తర్వాత రోజురోజుకీ ఉపాధి హామీ నిధుల్లో  భారీ కోతలు విధిస్తున్నారని 1,20,000 కోట్లు ఉన్న ఉపాధి హామీ బడ్జెట్ను 69 వేల కోట్ల కు కుదించారని దీనివల్ల దేశవ్యాప్తంగా పని దినాలు దారుణంగా పడిపోయాయని పేర్కొన్నారు. గ్రామీణ ఉపాధి హామీ పథకానికి రెండు లక్షల కోట్లు కేటాయించాలని  వేతనాలకు ఆధారం అనుసందనం చేసే ప్రక్రియను ఆపాలని వారు డిమాండ్ చేశారు. కరువు నేపథంలో 200 రోజులు పని దినాలు 600 రూపాయల వేతనం ఇవ్వాలని మితిమీరిన రాజకీయ జోక్యంతో  చాలా జాబ్ కార్డులు  తొలగించారని  అర్హులైన వారందరికీ కొత్త జాబ్ కార్డులు ఇవ్వాలని గ్రామీణ ఉపాధి హామీ పథకంలో అవినీతి అరికట్టాలని వారు డిమాండ్ చేశారు. రాబోయే రోజుల్లో ఉపాధి హామీ పరిరక్షణ కోసం జరిగే ఉద్యమంలో ఉపాధి కూలీలు పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని వారు కోరారు.ఈ కార్యక్రమంలో  ఎల్లప్ప, నాగన్న,ప్రసాదు,బెన్ని,పాల్ సుధాకర్, గోవిందు  తదితరులు పాల్గొన్నారు. అనంతరం ఎంపీడీవో కార్యాలయంలో వినతి పత్రం అందజేశారు.