Oct 26,2023 13:41

ప్రజాశక్తి-కపిలేశ్వరపురం : కపిలేశ్వరపురం మండలంలోని వెదురుమూడి గ్రామంలో ఎన్ఆర్ఈజీఎస్ నిధులు రూ 40 లక్షలతో నూతనంగా నిర్మించిన సచివాలయం భవనాన్ని ఎమ్ ఎల్ సీ తోట త్రిమూర్తులు ప్రారంభోత్సవం చేశారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ చోడే రామ తులసి రాంబాబు అధ్యక్షతన జరిగిన సభలో జెడ్పీటీసీ సభ్యుడు పుట్టపూడి వీర వెంకట సూర్యనారాయణ అబ్బు తదితర నాయకులు పాల్గొని మాట్లాడారు .సచివాలయం వ్యవస్థ ద్వారా గాంధీ కలలు కన్న గ్రామ స్వరాజ్యం సాకారం చేసిన ఘనత సీఎం జగన్ మోహన్ రెడ్డి కే దక్కుతుందని జెడ్పీటీసీ పుట్టపూడి అన్నారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా మన రాష్ట్రంలో గ్రామ వాలెంటీర్, సచివాలయం వ్యవస్థలు ఏర్పాటు చేసి లక్షలాది నిరుద్యోగులకు ఉద్యోగ కల్పన చేసి, ఇంటిముంగిటకే సంక్షేమ పథకాలు అందిస్తూ ప్రజల మన్ననలు  పొందారని ఆయన పేర్కొన్నారు. కార్యక్రమంలో సర్పంచ్ సోడే రామ తులసి రాంబాబు చూడే సూరిబాబు జెడ్పీటీసీ సభ్యుడు పుట్ట పూడి అబ్బు, ఆర్ బి కే సలహా కమిటీ చైర్మన్ పుట్టా కృష్ణబాబు, వైసీపీ నాయకులు రెడ్డి రాధా కృష్ణ, వైస్ ఎంపిపి గుణ్ణం భాను ప్రసాద్, వైస్ ప్రెసిడెంట్ చుండ్రు అచ్యుత రామారావు,నక్క సింహాచలం, ఎంపిడిఒ రామ కృష్ణ రెడ్డి,కార్యదర్శి వీ.డి.వి లక్ష్మి, వివిధ గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీ సభ్యులు ,వైఎస్ఆర్ పార్టీ నాయకులు, సచివాలయ సిబ్బంది,తదితరులు పాల్గొన్నారు.