
ప్రజాశక్తి-పిసిపల్లి: రోగులకు మెరుగైన సేవలు అందించాలని స్థానిక ఎంపీపీ అత్యాల జఫన్య అన్నారు. సోమవారం ఉదయం పీసీపల్లి ప్రభుత్వ వైద్యశాలలో ఆసుపత్రి అభివృద్ధి సలహా కమిటీ సమావేశం ఎంపీపీ జఫన్య అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ వైద్యశాలకు వచ్చే రోగులకు మెరుగైన సేవలు అందించాలని ఆయన అన్నారు. పాము, తేలు కాటు లాంటి అత్యవసర మందులు ఎప్పుడూ అందుబాటులో ఉంచాలని అన్నారు. ప్రభుత్వం నుంచి వచ్చే నిధులతో ప్రజలకు అవసరమైన అత్యవసర మందులతో పాటు, ప్రజలకు అవసరమైన వాటిని కూడా కొనుగోలు చేసి అందుబాటులో ఉంచాలని అన్నారు. పరిసరాలను పరిశుభ్రంగా వుంచాలని, వైద్య సిబ్బంది కూడా అందుబాటులో వుండాలని అన్నారు. ఈ సమావేశానికి స్థానిక ఎంపీడీవో కే శ్రీనివాస్రెడ్డి స్థానిక ప్రభుత్వ వైద్యురాలు డాక్టర్ ఏ నాగరాజు లక్ష్మి, స్థానిక సర్పంచ్ టీ మరియమ్మ, ఓకే రెడ్డి తదితరులు పాల్గొన్నారు.