
ప్రజాశక్తి మండపేట : విజయదశమి సందర్భంగా పట్టణంలోని గాంధీనగర్ లో ఉన్న కనకదుర్గమ్మ అమ్మను మున్సిపల్ చైర్ పర్సన్ పతివాడ నూక దుర్గారాణి దర్శించుకొని విశేష పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె పట్టణ ప్రజలందరికీ విజయదశమి శుభాకాంక్షలు తెలియజేశారు. పూజా కార్యక్రమంలో ఏఎంసి డైరెక్టర్ కొప్పిరెడ్డి పద్మావతి, కౌన్సిలర్లు అమలదాసు లక్ష్మీ రుద్రమూర్తి, శెట్టి కళ్యాణి, బొక్కా సరస్వతి నీలం దుర్గ తదితరులు పాల్గొన్నారు.