Nov 02,2023 18:27

రమణయ్య చిత్రపటానికి నివాళి అర్పిస్తున్న నాయకులు

ప్రజాశక్తి-తోటపల్లిగూడూరు :రౖతు కూలీల సమస్యల పరి ష్కారం కోసం కాల్తీ రెడ్డి రమణ య్య ఎనలేని కషి చేశారని సిపిఎం జిల్లా కార్యదర్శి మూలం రమేష్‌ పేర్కొన్నారు. గురువారం మండలంలోని మల్లి కార్జునపురం గ్రామానికి చెందిన సిపిఎం నాయకులు కాల్తిరెడ్డి రమణయ్య 24వ వర్థంతి కార్యక్రమం జరిగింది. సిపిఎం మండల కార్యదర్శి వేగూరు వెంకయ్య అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా రమేష్‌ పాల్గొన్నారు. ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ పేదల సమ స్యల పరిష్కారం కోసం కాల్తిరె డ్డి రమణ య్య అలుపెరుగని పోరాటాలు చేశారని కొని యా డారు. సిపిఎం సీనియ ర్‌ నాయకులు జక్కా వెంక య్యతో రమణయ్యకు అత్యం త సన్నిహిత సంబంధాలు ఉన్నాయన్నారు. సిపిఎం జిల్లా కార్యవర్గ సభ్యు లు ఎం. మోహన్‌ రావు, నెల్లూరు యాదగిరి, కెవిపిఎస్‌ జిల్లా కార్యదర్శి ఆలూరు తిరిపాలు, జిల్లా కమి టీ సభ్యులు టి. దయాకర్‌, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా నాయకులు నక్కా రాధాయ్య, వే గూ రు వెంకయ్య, పచ్చా మధు తదితరులు రమ ణయ్య సేవలను కొనియాడారు. రావు సిపిఎం జెం డాను ఆవి ష్కరించారు. అనంతరం రమ ణ య్య చిత్రపటానికి పూలమా లవేసి నివాళి అర్పించారు. శాఖా కా ర్య దర్శి కాల్తీరెడ్డి రమణమ్మ, నాయకులు కె చిన్నా, బండి శౌరి, డివైఎఫ్‌ఐ నాయ కులు పచ్చ రాజేష్‌ ఉన్నారు.