
ప్రజాశక్తి - జీలుగుమిల్లి
జాతీయ రహదారిపై రోడ్ ప్రమాదాల నివారణకై సోమవారం వాహక నిరోధకాలు ఏర్పాటు చేసినట్లు ఎస్ఐ వి.చంద్రశేఖర్ తెలిపారు. మండలంలోని దర్భగూడెం, లక్ష్మీపురం గ్రామాల మధ్యనున్న జాతీయ రహదారిపై నిత్యం ఏదోక ప్రదేశంలో ప్రమాదాలు జరుగుతుండటంతో దర్భగూడెం సొసైటీ అధ్యక్షులు కొల్లూరి రాంబాబు అధ్వర్యంలో ఈ వాహక నిరోధకాలు ఏర్పాటు చేశారన్నారు. ఈ కార్యక్రమంలో కొప్పుల చౌదరి రెడ్డి, కె.శ్రీను, కంచర్ల పాండు, పోతియ్య, స్టేషన్ సిబ్బంది కిషోర్, నాయక్, అశోక్లు పాల్గొన్నారు.