
ప్రజాశక్తి - బాపట్ల జిల్లా : రైతుల అభ్యున్నతి కోసం ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ పి.రంజిత్ బాషా తెలిపారు. వైఎస్ఆర్ రైతు భరోసా ఐదో ఏడాది రెండో విడత, పిఎం కిసాన్ నగదు పంపిణీని స్థానిక స్పందన సమావేశ మందిరంలో సోమవారం ప్రారంభించారు. శ్రీసత్యసాయి జిల్లాలో రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి బటన్ నొక్కి ప్రారంభించిన కార్యక్రమాన్ని జిల్లా రైతులు వీక్షించేలా అధికారులు ఏర్పాట్లు చేశారు. అనంతరం చెక్కు రూపంలో జిల్లా కలెక్టర్, ఎమ్మెల్సీ చేతుల మీదుగా రైతులు అందజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ రంగానికి ప్రభుత్వం అధిక ప్రాధాన్య ఇస్తున్నట్లు తెలిపారు. రైతుల కోసం సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నట్లు తెలిపారు. జిల్లాలో 1,91,843 మంది రైతులకు రూ. 79.87 కోట్ల నిధులు విడుదలైనట్లు తెలిపారు. ఎమ్మెల్సీ పోతుల సునీత రాష్ట్రంలో రైతు సంక్షేమ పాలన సాగు తుందన్నారు. రైతులను రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదు కుంటుందన్నారు. పంటల కోత సమయంలో రైతులను ఆదుకోవడానికి నగదు పంపిణీ చేయడం శుభపరిణామన్నారు. ఈ క్రాప్ నమోదు నుంచి సున్నా వడ్డీతో పంటల బీమా వర్తింప చేస్తూ రైతులకు వెన్నుదన్నుగా ప్రభుత్వం నిలిచిందన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలను రైతులు సద్వి నియోగం చేసుకొని అభివద్ధి చెందాలన్నారు. జిల్లా వ్యవసాయ సలహా మండలి చైర్మన్ మంతెన దశరథ మహారాజు మాట్లాడుతూ పంటల కోత సమయంలో రైతులను ఆదుకోవడం శుభ పరిణా మన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ శాఖ అధికారి షేక్ అబ్దుల్ సత్తార్, ఉద్యాన శాఖ ఏడీ జె.జెనెమ్మ, మార్కెటింగ్ శాఖ ఏడీ రమేష్ బాబు, పశుసంవర్ధక శాఖ అధికారి డాక్టర్ హను మంతరావు, ఎఎంసి చైర్మన్ పి.ప్రసాద్, రైతులు పాల్గొన్నారు.