
జంగారెడ్డిగూడెం : మండలంలోని 14 రైతుభరోసా కేంద్రాల ద్వారా ధాన్యం కొనుగోళ్లు ప్రారంభమవుతాయని కెఆర్ పురం వ్యవసాయ శాఖ ఉప సంచాలకులు బుజ్జిబాబు తెలిపారు. గురవాయిగూడెంలో రైతు భరోసా కేంద్రాన్ని ఆయన పరిశీలించారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ సిబ్బంది, రైతులు పాల్గొన్నారు.
పోలవరం : గూటాలలోని ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఎంపిపి సుంకర వెంకటరెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ సలహా మండలి ఛైర్మన్ దత్తి రాంబాబు పాల్గొన్నారు.