Nov 15,2023 23:33

రాష్ట్రస్థాయి పోటీలకు ఆర్కేస్సార్‌ విద్యార్థులు

రాష్ట్రస్థాయి పోటీలకు ఆర్కేస్సార్‌ విద్యార్థులు
ప్రజాశక్తి- కార్వేటినగరం: రాష్ట్రస్థాయి పోటీలకు ఆర్కేఎస్సార్‌ విద్యార్థులు ఎంపికైనట్లు ఆ పాఠశాల హెచ్‌ఎం కోటేశ్వరరావు తెలిపారు. బుధవారం పాఠశాలలో విద్యార్థులను అభినందిస్తూ హెచ్‌ఎం మాట్లాడుతూ ఈ నెల 9,10వ తేదీల్లో విశాఖ పట్టణంలో నిర్వహించిన జిల్లాస్థాయి అండర్‌-14 విభాగంలో వాలీబాల్‌, హ్యాండ్బాల్‌ పోటీల్లో 9వ తరగతి చదువుతున్న నిఖిల్‌ ఆర్య, జశ్వంత్‌లు క్రీడల్లో ప్రతిభ కనబరిచి ద్వితీయస్థానంలో నిలిచి ప్రసంసాపత్రాన్ని అందుకున్నారు. వీరు త్వరలో జరగనున్న రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొంటారని పాఠశాల హెచ్‌ఎం తెలిపారు. ఉపాధ్యాయులు ఉమాశంకర్‌, మాధవరెడ్డి, వ్యాయామ ఉపాధ్యాయుడు మాండవ్య పలువురు పాల్గొన్నారు.