Oct 28,2023 00:49

ఉపాధ్యాయులు

ప్రజాశక్తి-రావికమతం:మండలంలో మేడివాడ హైస్కూల్‌ విద్యార్థులు రాష్ట్రస్థాయి క్రీడా పోటీలకు ఎంపికైనట్లు పాఠశాల ప్రధానోపాధ్యాయులు వంకాయల రామారావు తెలిపారు. ఈ సందర్భంగా పత్రిక విలేకరులతో రామారావు మాట్లాడుతూ, మేడవాడ హైస్కూల్లో 8వ తరగతి చదువుతున్న మోపాడ భాగ్యశ్రీ అండర్‌ 14 బాలికల విభాగంలో రాష్ట్రస్థాయి కబడ్డీ, ఖో ఖో, సాఫ్ట్బాల్‌, పరుగు పందెం విభాగంలో రాష్ట్రస్థాయి క్రీడాపోటీలకు, అండర్‌ 17 బాలుర విభాగంలో రాష్ట్రస్థాయి రగ్బీ క్రీడా పోటీలకు 10వ తరగతి చదువుతున్న ప్రవీణ్‌ ప్రకాష్‌, అండర్‌ 14 రగ్బీ రాష్ట్రస్థాయి క్రీడా పోటీలకు 8వ తరగతి చదువుతున్న ఎస్‌.లిఖిత ఎంపిక అయ్యారన్నారు. ఎంపికైన విద్యార్థులను ప్రధానోపాధ్యాలు, ఉపాధ్యాయ సిబ్బంది అభినందించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు నాగమణి, రమణాజి, అప్పలనాయుడు, నాగేశ్వరరావు, మహాలక్ష్మి నాయుడు, పాపారావు, బాలరాజు, కష్ణవేణి, అన్నపూర్ణ, పద్మావతి, శ్యామలత, శాంతి పాల్గొన్నారు.