Nov 07,2023 23:42
కొండపిలో గ్రామస్తులకు కరపత్రాలు అందిస్తున్న ఎమ్మెల్యే స్వామి

ప్రజాశక్తి-కొండపి: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి చంద్రబాబు పాలన ఎంతో అవసరమని కొండపి శాసనసభ్యులు డాక్టర్‌ డోలా శ్రీ బాలవీరాంజనేయస్వామి తెలిపారు. మంగళవారం కొండపిలోని పొదిలి రోడ్డులో సాయినగర్‌ కాలనీ తదితర కాలనీలో బాబు ష్యూరిటీి-భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా చంద్రబాబు ప్రవేశపెట్టిన మ్యానిఫెస్టోకు సంబంధించిన కరపత్రాలను అందజేశారు. టిడిపి అదికారంలోకి వస్తే ప్రతి కుటుంబానికి ఎంత మేలు జరుగుతుందో, ఇప్పుడున్న అధికార ప్రభుత్వం ఈ నాలుగన్నరేళ్లలో ఏమి చేసిందీ ప్రజలకు వివరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే స్వామి మాట్లాడుతూ టిడిపి అధికారంలోకి వచ్చాక ప్రతి విద్యార్థికీ అమ్మఒడి వర్తింపచేస్తామని అన్నారు. కొండపిలో పొదిలి రోడ్డులో వర్షం కురిసినప్పుడు వర్షపు నీరు నిల్వ ఉండడంతో అక్కడ మురికి సమస్య ఎక్కువగా ఉందని గతంలో టిడిపి ప్రభుత్వం అదికారంలో ఉన్నప్పుడు ఆ సమస్య పరిష్కారం కోసం కొండపిలో అండర్‌ డ్రైనేజీ ఏర్పాటు చేయాలని, వాటికోసం రూ.4.50 కోట్లు నిధులు మంజూరు చేశారన్నారు. కాని ఇప్పుడు అధికారంలో ఉన్న ప్రభుత్వం నియోజక కేంద్రమైన కొండపిలో ఏమాత్రం ఈ సమస్య గురించి పట్టించుకున్న దాఖలాలు లేవన్నారు. రాబోయే ఎన్నికల్లో టిడిపి అధికారంలోకి రాగానే కొండపి పట్టణంలో ఉన్న సమస్యలన్నీ పరిష్కరిస్తానని అన్నారు. రాష్ట్రం అభివృద్ధి జరగాలంటే టిడిపి అధినేత చంద్రబాబు మళ్లీ ముఖ్యమంత్రి కావాల్సిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు. ఏ తప్పూ చేయకపోయినా బాబును అన్యాయంగా అరెస్టు చేసి జైలులో పెట్టారన్నారు. సంక్షేమం, అభివృద్ధి చేయాలన్నా, రాష్ట్రం పురోభివృద్ధి వైపు పయనించాలన్నా టిడిపి అధికారంలోకి రావాల్సిన అవసరం ఉందని అన్నారు. అండగా నిలవాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో ఒంగోలు పార్లమెంట్‌ ఉపాధ్యక్షులు జి రామయ్యచౌదరి, మండల పార్టీ అధ్యక్షులు బి యలమందనాయుడు, రాష్ట్ర నాయకులు వసంతరావు, రావిపాటి సీతమ్మ, మాజీ ఎంపిపి దేపూరి రత్తమ్మ, మండల మహిళా నాయకులు బి ప్రసన్న లక్ష్మి, నన్నూరి సుబ్బరామయ్య, బి సోమయ్య,షేక్‌ కాలేషా, కందిమళ్ల రమేష్‌, దేపూరి సుబ్బారావు, కాశయ్య, ఎల్లావుల వెంకటేశ్వర్లు, ముక్కు ప్రసాదు, కూనంనేని శంకర్‌, నేతి రవికుమార్‌, బి అనిల్‌కుమార్‌, మునగల జాన్‌, గడ్డం మధు, గుది రమణయ్య, దేవరాల బ్రహ్మయ్య, మండలంలోని టిడిపి నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
కొండపిలో గ్రామస్తులకు కరపత్రాలు అందిస్తున్న ఎమ్మెల్యే స్వామిరాష్ట్రానికి చంద్రబాబు పాలన అవసరం
ప్రజాశక్తి-కొండపి
ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి చంద్రబాబు పాలన ఎంతో అవసరమని కొండపి శాసనసభ్యులు డాక్టర్‌ డోలా శ్రీ బాలవీరాంజనేయస్వామి తెలిపారు. మంగళవారం కొండపిలోని పొదిలి రోడ్డులో సాయినగర్‌ కాలనీ తదితర కాలనీలో బాబు ష్యూరిటీి-భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా చంద్రబాబు ప్రవేశపెట్టిన మ్యానిఫెస్టోకు సంబంధించిన కరపత్రాలను అందజేశారు. టిడిపి అదికారంలోకి వస్తే ప్రతి కుటుంబానికి ఎంత మేలు జరుగుతుందో, ఇప్పుడున్న అధికార ప్రభుత్వం ఈ నాలుగన్నరేళ్లలో ఏమి చేసిందీ ప్రజలకు వివరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే స్వామి మాట్లాడుతూ టిడిపి అధికారంలోకి వచ్చాక ప్రతి విద్యార్థికీ అమ్మఒడి వర్తింపచేస్తామని అన్నారు. కొండపిలో పొదిలి రోడ్డులో వర్షం కురిసినప్పుడు వర్షపు నీరు నిల్వ ఉండడంతో అక్కడ మురికి సమస్య ఎక్కువగా ఉందని గతంలో టిడిపి ప్రభుత్వం అదికారంలో ఉన్నప్పుడు ఆ సమస్య పరిష్కారం కోసం కొండపిలో అండర్‌ డ్రైనేజీ ఏర్పాటు చేయాలని, వాటికోసం రూ.4.50 కోట్లు నిధులు మంజూరు చేశారన్నారు. కాని ఇప్పుడు అధికారంలో ఉన్న ప్రభుత్వం నియోజక కేంద్రమైన కొండపిలో ఏమాత్రం ఈ సమస్య గురించి పట్టించుకున్న దాఖలాలు లేవన్నారు. రాబోయే ఎన్నికల్లో టిడిపి అధికారంలోకి రాగానే కొండపి పట్టణంలో ఉన్న సమస్యలన్నీ పరిష్కరిస్తానని అన్నారు. రాష్ట్రం అభివృద్ధి జరగాలంటే టిడిపి అధినేత చంద్రబాబు మళ్లీ ముఖ్యమంత్రి కావాల్సిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు. ఏ తప్పూ చేయకపోయినా బాబును అన్యాయంగా అరెస్టు చేసి జైలులో పెట్టారన్నారు. సంక్షేమం, అభివృద్ధి చేయాలన్నా, రాష్ట్రం పురోభివృద్ధి వైపు పయనించాలన్నా టిడిపి అధికారంలోకి రావాల్సిన అవసరం ఉందని అన్నారు. అండగా నిలవాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో ఒంగోలు పార్లమెంట్‌ ఉపాధ్యక్షులు జి రామయ్యచౌదరి, మండల పార్టీ అధ్యక్షులు బి యలమందనాయుడు, రాష్ట్ర నాయకులు వసంతరావు, రావిపాటి సీతమ్మ, మాజీ ఎంపిపి దేపూరి రత్తమ్మ, మండల మహిళా నాయకులు బి ప్రసన్న లక్ష్మి, నన్నూరి సుబ్బరామయ్య, బి సోమయ్య,షేక్‌ కాలేషా, కందిమళ్ల రమేష్‌, దేపూరి సుబ్బారావు, కాశయ్య, ఎల్లావుల వెంకటేశ్వర్లు, ముక్కు ప్రసాదు, కూనంనేని శంకర్‌, నేతి రవికుమార్‌, బి అనిల్‌కుమార్‌, మునగల జాన్‌, గడ్డం మధు, గుది రమణయ్య, దేవరాల బ్రహ్మయ్య, మండలంలోని టిడిపి నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.