
ప్రజాశక్తి-గిద్దలూరు రూరల్
విశాఖ ఉక్కు పరిరక్షణ, కడపలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు, ప్రకాశం జిల్లా యూనివర్సిటీ, త్రిబుల్ ఐటీలకు శాశ్వత భవనాలను ఏర్పాటు చేయాలని కోరుతూ నవంబర్ 8వ తేదీన జరిగే రాష్ట్ర వ్యాప్త విద్యాసంస్థల బంద్ను విజయవంతం చేయాలని కోరుతూ ఎస్ఎఫ్ఐ గిద్దలూరు కమిటీ సభ్యులు శనివారం బందు పోస్టర్ విడుదల చేశారు. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి సిహెచ్ వినోదు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక హౌదా విభజన హామీలు అమలు చేయకుండా రాష్ట్రానికి తీరని ద్రోహంచేసి, రాష్ట్రంలో ఉన్న విశాఖ ఉక్కు పరిశ్రమను ప్రైవేటుపరం చేసి మరోసారి ఆంధ్ర ప్రజలకు అన్యాయం చేయాలని చూస్తుంది. ఈ వైఖరిని వైసిపి, టిడిపి, జనసేన పార్టీలు ప్రశ్నించకపోగా సానుకూలంగా వ్యవహరించడం అంటే దారుణమైన చర్య అన్నారు. ఈ వైఖరిని ఖండిస్తూ విశాఖ ఉక్కు ఉద్యమం ప్రారంభించి 1000 రోజులు అయిన సందర్భంగా ఈ బంద్ నిర్వహిస్తున్నట్లు వారు తెలిపారు.