
రాష్ట్ర ఖోఖో జట్టుకు టేకుమంద విద్యార్థులు
ప్రజాశక్తి- బంగారుపాళ్యం: అండర్- 17 రాష్ట్రస్థాయి బాలికల విభాగం ఖోఖో జట్టుకు మండలంలోని టేకుమంద జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు ఎంపికైనట్టు ప్రధానోపాధ్యాయులు అబ్దుల్ సుభాన్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రస్థాయి అండర్ - 17 విభాగంలో చిత్తూరు జిల్లా తరపున రాష్ట్రస్థాయి ఖోఖో పోటీలకు పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న విద్యార్థులు నిఖిత హాస్మిత ఎంపికయ్యారని, వీరు ఈనెల 16, 17, 18 తేదీలలో పశ్చిమగోదావరి జిల్లాలో కాకినాడ జరుగుతున్న 67వ రాష్ట్రస్థాయి పోటీలలో పాల్గొంటారని తెలిపారు. విద్యార్థులు ఎంపికవ్వడం పట్ల పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, రాష్ట్ర కురువ సంఘం అధ్యక్షులు అమర్నాథ్ సర్పంచ్ రత్నయ్య క్రీడాకారులని అభినందించారు.