
ప్రజాశక్తి-తిరుపతి(మంగళం): ఎన్నడూ లేని విధంగా రాష్ట్రవ్యాప్తంగా ప్రస్తుతం అధికార పార్టీకి తొత్తులుగా వ్యవహరిస్తూ ఫలితం లేని ఓటర్ జాబితాను తయారు చేసి విడుదల చేశారని టిడిపి నాయకులు కంకణాల రజనీకాంత్ నాయుడు విమర్శించారు. శనివారం తిరుపతి ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ క్షేత్రస్థాయిలో బిఎల్వోలు ఓటర్ జాబితా పరిశీలనలో అధికార పార్టీకి తలోగ్గి పని చేశారని, దానివల్లనే డబల్ ఎంట్రీ ఓట్లు, చనిపోయిన వారి ఓట్లు, శాశ్వతంగా అడ్రస్సులో లేని వారి ఓట్లు అలాగే ఉండిపోయి తిరిగి మళ్ళీ ప్రస్తుతం విడుదల చేసిన ఓటర్ల జాబితాలో వచ్చాయని ఆధారాలు చూపుతున్న ఎవరూ పట్టించుకో కపోవడంతో రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారికి అన్ని ఆధారాలతో లేఖలు రాసి పంపామన్నారు. ఇకనైనా ఉన్నతాధికారులు తప్పుల తడకగా ఉన్న ఓటర్ల జాబితాను పారదర్శక ఓటరు జాబితాగా తయారు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు పాల్గొన్నారు.