Nov 16,2023 21:53

సోమల: విద్యార్థులు పుస్తక పట్టణం ద్వారా విలువైన విజ్ఞాన సంపదను పొందవచ్చునని ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఎల్లయ్య అన్నారు. జాతీయ గ్రంధాలయ వారోత్సవాలలో భాగంగా మూడవరోజు స్థానిక గ్రంథాలయంలో విద్యార్థులచే పుస్తక పఠనం కార్యక్రమాన్ని నిర్వహించారు. గ్రంధాలయ అధికారి రామకష్ణ మాట్లాడుతూ గ్రంథాలయోద్యమంలో పాల్గొన్న ప్రముఖులైన డాక్టర్‌ ఎస్‌ఆర్‌ రంగనాథన్‌, పాతూరి నాగభూషణం, అయ్యంకి వెంకట రమణయ్య, గాడిచర్ల సర్వోత్తమరావు లాంటి ఉద్యమకారుల గురించి విద్యార్థులకు వివరించారు. పాఠశాల సిబ్బంది పురుషోత్తం, సుదర్శన్‌, విద్యార్థులు పాల్గొన్నారు.