Oct 24,2023 23:11

ప్రజాశక్తి-మండపేట
రాయవరం మండలం, పసలపూడి గ్రామంలో ''బాబుతో నేను'' కార్యక్రమం మంగళవారం నిర్వహించారు. ఎంఎల్‌ఎ వేగుళ్ల జోగేశ్వరరావు పార్టీ శ్రేణులతో కలసి క్లస్టర్‌-7లో యూనిట్‌ 31లో పర్యటించి ప్రతీ ఇంటికి వెళ్లి వైసిపి ప్రభుత్వ అరాచక పాలనను ప్రజలకు తెలియజేశారు. ఈ సంధర్బంగా ఆయన మాట్లాడుతూ వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో టిడిపికి మద్దతు ఇచ్చి చంద్రబాబును ముఖ్యమంత్రి చేయవలసిన అవసరం ఎంతైనా ఉందన్నారు. రాష్ట్ర అభివృద్ధిని దష్టిలో ఉంచుకుని ప్రతి ఒక్కరూ టిడిపికి అండగా నిలబడాలని కోరారు. చంద్రబాబుపై అక్రమ కేసులు బనాయించిన వైసిపి ప్రభుత్వానికి ప్రజలు తగిన గుణపాఠం చెప్పాలన్నారు. కార్యక్రమంలో టిడిపి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
చంద్రబాబు అరెస్ట్‌కు నిరసన
మాజీ ముఖ్యమంత్రి, టిడిపి జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు అక్రమ అరెస్టుకు నిరసనగా టిడిపి పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ పిలుపు మేరకు 'జగనాసుర దహనం' కార్యక్రమం సోమవారం రాత్రి నిర్వహించారు. టిడిపి శ్రేణులు కలసి ''సైకో పోవాలి'' అని రాసిన పత్రాలను మంటలో దహనం చేసి చంద్రబాబుకు మద్దతుగా 5 నిమిషాల పాటు నిరసన తెలియజేశారు. ఈ సంధర్బంగా నాలుగున్నరేళ్లుగా అరాచక, విధ్వంసక పాలన సాగిస్తున్న సైకో జగనాసురుడి పీడ పోవాలని నినాదాలు చేశారు. కార్యక్రమంలో టిడిపి పట్టణ అధ్యక్షులు ఉంగరాల రాంబాబు, కార్యకర్తలు, అభిమానులు, అధిక సంఖ్యలో పాల్గొన్నారు.కొత్తపేట రాష్ట్రంలో రాక్షస పాలన పోవాలి అంటూ పత్రంపై రాసి ఆ ప్రతులను కొత్తపేట టిడిపి నాయకులు గుబ్బల మూర్తి స్వగహం వద్ద తగలబెట్టారు. మూర్తి మాట్లాడుతూ చంద్రన్న పాలన రావాలి అని కోరారు. రాష్ట్రంలో అరాచక పాలన రాజ్యమేలుతోంది. దానిని అంతమొందించి, ప్రజాపాలన తెచ్చుకోవలసిన ఆవశ్యకత ప్రజలకు ఏర్పడిందన్నారు. ఎటువంటి ఆధారాలు లేకుండా చంద్రబాబుని అక్రమంగా అరెస్టు చేశారన్నారు. న్యాయం గెలిచి ఆయన నిజాయితీగా బయటపడాలనీ కోరారు. కార్యక్రమంలో గుబ్బల మూర్తి వారి కుమార్తెలతో పాటు జిల్లా టిడిపి లీగల్‌ సెల్‌ కార్యదర్శి గుబ్బల సుబ్రహ్మణ్యం పాల్గొన్నారు.