Oct 22,2023 23:19

ప్రజాశక్తి-అమలాపురం
పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యతని పలువురు అన్నారు. స్వామి వివేకానంద యోగా ఆశ్రమ విద్యార్థుల ఆధ్వర్యంలో ఆదివారం అమలాపురం పట్టణంలో మొక్కలు నాటారు. పర్యావరణాన్నికాపాడడం కోసం పచ్చని మొక్కని నాటేద్దాం అంటూ అమలాపురంలో యోగా ఆశ్రమం విద్యార్థులు పట్టణ పరిసర ప్రాంతాల్లో 1000 మొక్కలు నాటారు. కాలుష్యం పోగొట్టి ఆరోగ్యంగా జీవించడం కోసం ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలు చేస్తూ నేటి సమాజానికి స్ఫూర్తిగా విద్యార్థులు నిలుస్తున్నారని ఈ సందర్భంగా వారిని పలువురు కొనియాడారు. కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా అమలాపురం అమలాపురం డిఎస్‌పి అంబికా ప్రసాద్‌, యోగా స్టూడెంట్స్‌ సంస్కార భారతి కార్యదర్శి అయినవిల్లి నాగ శ్రీవల్లి, గోటేటి గంగాధర్‌రావు, అయినవిల్లి కామాక్షమ్మ, టి.సూర్య కుమారి, పి.కృష్ణ నవీన్‌, పట్నాల శైలజ, యోగా శ్రీనివాస్‌, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.